తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు జాతీయ స్థాయిలో తీసుకు వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆ విషయాన్ని కీలకంగా చర్చించడం జరిగింది. టీఆర్ఎస్ ఇక ముందు బీఆర్ఎస్ గా మారబోతుంది అంటూ కేసీఆర్ వర్గీయులు మరియు టిఆర్ఎస్ నాయకులు గొప్పగా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ రాజకీయ పార్టీని ప్రారంభించి విప్లవాత్మక మార్పులు తీసుకు రాబోతున్నారు అంటూ ఆ పార్టీ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు.
ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల బిఎస్ఆర్ పై స్పందించారు. టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఎస్ఆర్ అవుతుందట.. బీఎస్ఆర్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. ప్లీనరీలో వడ్ల కొనుగోలు పై అభినందన తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి కేసీఆర్ కి సిగ్గుండాలి అంటూ తీవ్ర స్థాయిలో షర్మిల విరుచుకు పడ్డారు. టిఆర్ఎస్ నేతలు గౌతమ బుద్ధులుగా చెప్పుకుంటున్నారు.. ఏ పాపం చేయలేదని వారికి వారే కితాబిచ్చుకున్నారు. కానీ ఆ పార్టీ నాయకులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు.
991571 966583Thanks for providing such a fantastic write-up, it was superb and extremely informative. Its my first time that I check out here. I identified a great deal of informative stuff inside your post. Maintain it up. Thank you. 667952
729030 112372I actually prize your work , Excellent post. 23191
649123 19967Glad to be 1 of several visitants on this incredible internet web site : D. 222246