YSRCP: సరిగ్గా ఏడాది సమయం కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి.! కానీ, సెప్టెంబర్లో విశాఖలో కాపురం పెడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయాలు అనూహ్యంగా మారబోతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన.కర్నాటక అంటే తెలుగు రాష్ట్రాలు రెండింటికీ పొరుగు రాష్ట్రమే. ఆ కర్నాటక ప్రభావం, తెలుగు రాష్ట్రాలపై ఖచ్చితంగా వుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులూ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొందరు అక్కడికి వెళ్ళి ఆయా పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నారు కూడా. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తే.?
ఔను, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఒకే సారి ఎన్నికలు జరుగుతాయన్నది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన. అది కూడా నవంబర్లోనే ఎన్నికలు జరగొచ్చునట. కాస్త ముందుకొచ్చి, అక్టోబర్లో కూడా కావొచ్చునంటున్నారు. అందుకేనేమో, సెప్టెంబరులోనే విశాఖలో కాపురం.. అంటున్నారు వైఎస్ జగన్.
విశాఖకు కాపురం వెళ్ళి.. అక్కడే వుంటూ, అదే రాజధాని.. అని చెప్పేసి, ముందస్తు ఎన్నికలు వెళ్ళాలన్నది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశ్యమట.! ఇంతకీ, మూడు రాజధానుల్లో అమరావతిని పక్కకు తోసేశారు సరే, న్యాయ రాజధాని కర్నూలు మాటేమిటి.? మూడు ముక్కలాట ఆడతారు.. కానీ, అందులో కర్నూలు కూడా ఔట్.! ఈ మూడు ముక్కలాటలో రెండు ముక్కలు ఔట్.. ఒకే ముక్క.. అదే విశాఖే మొత్తం ఆట ఆడేస్తుంది.!