మూడు రాజధానులు (అభివృద్ధి వికేంద్రీకరణ), సీఆర్డీయే రద్దుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ విడుదల చేసిన విషయం విదితమే. అసెంబ్లీలో బిల్లుల ఆమోదం, శాసన మండలిలో గందరగోళం.. చివరికి గవర్నర్ సంతకంతో, ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. అయితే, ‘పరిపాలన వికేంద్రీకరణ – సీఆర్డీయే రద్దు’ గెజిట్పై రాష్ట్ర హైకోర్టు స్టేటస్కో జారీ చేసింది. రిప్లయ్ కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.
మూడు రాజధానులకు అనుకూలంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని గతంలోనే అమరావతి రైతులు సహా పలువురు న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయం విదితమే. ఓ దశలో ‘ఆయా బిల్లులు శాసన దశలో వున్నాయి..’ అంటూ ప్రభుత్వం కోర్టుకు విన్నవించుకుంది. అయినాసరే, రాజధాని నుంచి వివిధ విభాగాల్ని అటు కర్నూలుకి, ఇటు విశాఖకీ తరలించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయడంతో, హైకోర్టు అప్పట్లోనే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.
మరోపక్క, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం, శాసన ప్రక్రియను పూర్తి చేసింది. శాసన ప్రక్రియ పూర్తయ్యాకే అసలు కథ మొదలవుతుందని న్యాయ నిపుణులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేశారు. సీఆర్డీయే ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం.. ఇలా పలు అంవాల్ని ప్రస్తావిస్తూ, మూడు రాజధానులకు అసలు ఆస్కారమే లేదన్నది న్యాయ నిపుణుల వాదన. అందుకు భిన్నంగా ప్రభుత్వం, మొండి వైఖరిని ప్రదర్శిస్తూ మూడు రాజధానులపై ముందడుగు వేసింది.
ఈ నెల 14 వరకు ఆర్డినెన్స్పై హైకోర్టు ‘స్టేటస్ కో’ విధించిన దరిమిలా, ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయినట్లే భావించాలేమో. ఆగస్ట్ 16న విశాఖకు సీఎం జగన్ వెళతారనీ, అక్కడే కొత్త రాజధానికి శంకుస్థాపన చేస్తారనీ, అక్కడినుంచే పరిపాలన కూడా షురూ చేస్తారనీ ప్రచారం జరుగుతున్నవేళ, హైకోర్టు జారీ చేసిన ‘స్టేటస్ కో’ ఆదేశాలు ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే భావించాలేమో.
712814 527215I got what you intend, saved to favorites , really decent internet site . 869846
910903 387805Most appropriate the human race messages work to show your and present exclusive chance with special couple. Beginer appear system in advance of raucous folks will most likely always be aware most of the golden value off presentation, which is actually a persons truck. greatest man jokes 108623