నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతోపాటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. తిరుపతిలో ఉప ఎన్నికలో వైసీపీనే విజయం సాధించబోతోందని ఆరా సంస్థ వెల్లడించింది. సంస్థ అంచనాల్లో వైఎస్సార్ సీపీ 65.85%, టీడీపీ 23.10%, బీజేపీ 7.34% ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. తమ అంచనాలకు ఫలితాలకు మధ్య 2-3 శాతం తేడా ఉండొచ్చని తెలిపింది.
మరో ఎగ్జిట్ పోల్ సంస్థ ఆత్మసాక్షి తమ అంచనాలను వెల్లడిస్తూ.. వైఎస్సార్సీపీ 59.25%, టీడీపీ 31.25%, బీజేపీ 7.5% ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించబోతున్నారని అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా స్పష్టం చేస్తున్నాయి. మరి.. మే 2న ఆదివారం వెల్లడయ్యే ఫలితాల్లో విజయం ఎవరికి దక్కనుందో తేలనుంది.
306592 462653Disgrace on the search Google for not positioning this put up upper! Come on over and talk over with my site. 699045