విశాఖపట్నంలో అధికార పార్టీ నేతల అండదండలతో అధికారులు సైతం రెచ్చిపోతున్నారు. వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రతిపక్ష టీడీపీ నేతలను భయపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వైసీపీలో చేరకపోతే కేసుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ హెచ్చరికలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ పరిధిలో బార్లు నిర్వహిస్తున్న ఇద్దరు టీడీపీ నాయకులకు ఎక్సైజ్ శాఖలోని ఓ కీలక అధికారి ఆల్టిమేటం ఇచ్చినట్టు చెబుతున్నారు. రెండు రోజుల్లోగా అధికార పార్టీలో చేరకపోతే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చిరించినట్టు సమాచారం.
టీడీపీ నుంచి వారిని బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇందులో బాగంగానే ముందుగా ఆ ఇద్దరు నేతలకు చెందిన బార్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం పార్శిల్ గా బయటకు విక్రయిస్తున్నారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసుల్లో ముందుకు వెళ్లకూడదంటే టీడీపీని వీడి వైసీపీలో చేరాలని చెప్పి రెండు రోజుల డెడ్ లైన్ పెట్టినట్టు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వైసీపీ నేత ఆదేశాలకు అనుగుణంగా సదరు ఎక్సైజ అధికారి వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
428119 669027A blog like yours should be earning considerably cash from adsense..-., 586782
481993 548999Ill create a hyperlink towards the internet page about my personal weblog. 981731
915424 666844I only wish that I had the ability to convey what I wanted to say in the manner which you have presented this data. Thanks. 593137
902542 877543Wow, amazing weblog format! How lengthy have you ever been blogging for? 115349
305367 29955You ought to indulge in a contest for among the greatest blogs over the internet. Ill suggest this web website! 568626