సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరస హిట్స్ మీద ఉన్న మహేష్ తో పనిచేయడానికి టాప్ బ్యానర్లు చాలా నెలలుగా వెయిట్ చేస్తున్నాయి. అలాంటి బ్యానర్స్ లో ప్రముఖమైనది గీతా ఆర్ట్స్ సంస్థ. సాధారణంగా మెగా హీరోలతోనూ, మిడ్ రేంజ్ హీరోలతోనూ సినిమాలు తీసే గీతా సంస్థ, మహేష్ తో సినిమా కోసం ప్రయత్నించడం కొంత మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. గీతా ఆర్ట్స్ దగ్గర పరశురామ్ డేట్స్ ఉండడంతో అతనితో మహేష్ ప్రాజెక్ట్ సెట్ చేయాలని భావించారు. అయితే రెండు, మూడు సిట్టింగ్స్ జరిగినా కథ ఓ కొలిక్కి రాకపోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ ఉండదనే భావించారంతా.
సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురామ్ సినిమా ఉంటుందని మొదట భావిస్తే ఇప్పుడు వంశీ పైడిపల్లితో అని ఫిక్స్ అయింది. దానికి తోడు గీతా ఆర్ట్స్ వ్యవహారాలు అన్నీ తానై చూసుకుంటున్న బన్నీ వాసు కూడా మహేష్ తో సినిమా కోసం ప్రయత్నించాం కానీ కుదర్లేదు అని చెప్పాడు. త్వరలోనే తనతో సినిమా చేస్తామని అన్నాడు. మరోవైపు మహేష్ తో సినిమా కోసం గీతా గోవిందం తర్వాత ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న పరశురామ్ కూడా నాగ చైతన్యతో సినిమాను ప్రకటించడంతో ఇక మహేష్-పరశురామ్-గీతా ఆర్ట్స్ సినిమా అటకెక్కినట్లేనని భావించారు.
అయితే రీసెంట్ గా పరశురామ్ ఈ విషయంపై స్పందించాడు. సింహాచలం అప్పన్నను దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో ముచ్చటిస్తూ మహేష్ తో సినిమా ఉంటుందని, కథ కూడా సిద్ధమైపోయిందని ప్రకటించాడు. అంటే మహేష్ కథ విని ఓకే చెప్పేస్తినట్టేగా. సో, మహేష్-గీతా ఆర్ట్స్-పరశురామ్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు, జస్ట్ వాయిదా పడిందంతే. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది.
969354 564385Hi. Cool post. Theres a dilemma with the web site in chrome, and you may want to check this The browser will be the marketplace chief and a big component of other folks will miss your superb writing due to this difficulty. I like your Post and I am recommend it for a Internet site Award. 454145
891181 63319I agree with you. I wish I had your blogging style. 22343
62444 406122Some truly wonderful content on this internet internet site , thankyou for contribution. 137096