Switch to English

ఈ ప్రశ్నలకు ఏం జవాబు చెప్తారు జగన్ సారూ…!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

గెలవక ముందు ఒకలా, గెలిచిన తరువాత మరొకలా మాట్లాడటం మన రాజకీయనాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అందరిలోకి జగన్ చాలా స్పెషల్ అనుకున్నారు పాపం జనాలు. అవును చాలా స్పెషలే. అందుకే గత ప్రభుత్వం హయాములో జగన్ అమరావతికి అనుగుణంగా మాటలు మాట్లాడి.

కనీసం 30వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చెప్పి, రైతుల దగ్గర భూమిని సేకరించిన తరువాత, ఇప్పుడు అక్కడ రాజధాని కట్టడం వీలుకాదు అని చెప్పి ఏవో కొన్ని కట్టడాలు ఉంచి మిగతా రాజధాని మొత్తాన్ని అమరావతి నుంచి విశాఖకు అటు కర్నూలుకు షిఫ్ట్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటి?

టెక్నికల్ గా నిజంగానే అమరావతిలో రాజధాని కట్టడం సాధ్యంకాదా లేదంటే స్వలాభం కోసమే రాజధానిని షిఫ్ట్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ నిజంగా అమరావతిలో రాజధాని నిర్మించడం సాధ్యం కాకుంటే అప్పట్లో అసెంబ్లీలోనే వ్యతిరేకించాల్సింది కదా. అప్పుడు అలా ఎందుకు చేయలేదు.

లక్షకోట్లు అవసరం అవుతాయని ముందే తెలిస్తే సాధ్యం కాదు కాబట్టి అసెంబ్లీలో వ్యతిరేకిస్తే మరోలా ఉండేది కదా. ఇప్పుడు వైఎస్ జగన్ రాజధానిని షిఫ్ట్ చేస్తామని చెప్పినా దానికి అర్ధం ఉండేది. కానీ, అప్పుడు అనుకూలంగా మాట్లాడి.. ఇప్పుడు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియాలి.

ఇదే విషయాన్ని అమరావతి ప్రాంతంలోని రైతులు, మహిళలు, చివరకు వైకాపా కార్యకర్తలు, వైకాపా రైతులు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అనుకూలంగా వ్యాఖ్యలు చేయకుంటే మేము కూడా భూములు ఇచ్చేవాళ్ళం కాదుకదా అని అంటున్నారు. తాము సైతం భూములు ఇచ్చామని, ఇప్పుడు తమ గతి ఏంటి అని అంటున్నారు.

నేను విన్నాను, నేనున్నాను అని చెప్పిన జగన్, ఆరు నెలల కాలంలో ఏం విన్నారో, ఎందుకు ఉన్నారో అర్ధం కావడం లేదని రాజధాని ప్రాంత రైతులు వాపోతున్నారు. రాజధాని కడితే ముంపు వచ్చి మునిగిపోతుందని ముందుగానే తెలిస్తే అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

అమరావతి ప్రాంతంలోని రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైకాపానేతలపై ఉన్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఉన్నది. కానీ వాళ్ళు మాత్రం తప్పంతా అప్పటి ప్రభుత్వమే చేసిందన్నట్టు చెప్పి తప్పించుకుంటున్నారు. మాటలు చెప్పి తప్పించుకుంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఊరుకుంటారా చెప్పండి. ఆందోళనలు చేయరు. ఆందోళనలు చేస్తే ఊరుకునేది లేదంటే ఎలా కుదరదు కదా.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...