ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం బంతికి లాలాజలం పూయడం అనేది నిషేదం. ఇటీవల రాబిన్ ఊతప్ప ఆ పని చేయడం చర్చనీయాంశం అయ్యింది. దాని గురించి ఇంకా మర్చిపోకుండానే ఈసారి విరాట్ కోహ్లీ అదే పని చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో మూడవ ఓవర్ లో పృథ్వీ షా ఆడిన షాట్ ను ఆపిన కోహ్లీ బంతికి అనుకోకుండా తన లాలాజలంను పూశాడు.
వెంటనే గుర్తుకు వచ్చినట్లుగా తన చేయిని వెనక్కు తీసుకుని తప్పు చేసినట్లుగా ఒప్పుకుని తన చేతులు పైకి లేపి స్వారీ అన్నట్లుగా సంజ్ఞలు చేశాడు. తన పనికి వెంటనే నవ్విన కోహ్లీ మళ్లీ ఎప్పుడు జరుగదు అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. ఈమద్య కాలంలో వచ్చిన కొత్త నిబంధన అవ్వడం వల్ల చాలా మంది అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తున్నారు. కోహ్లీ ఘటనపై చాలా మంది స్పందించారు.
కొందరు కోహ్లీ కావాలని చేయలేదు అంటూ కామెంట్స్ చేయగా మరి కొందరు మర్చి పోయి చేశాడేమో అంటున్నారు. ఇక సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ఆటలో గెలిచే కసితో ఉన్నప్పుడు ఇలాంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి అంటూ పేర్కొన్నాడు.
860970 727460Ive been absent for some time, but now I remember why I used to love this blog. Thank you, I will try and check back far more often. How regularly you update your internet website? 810386