దేశంలో ఓపక్క కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. జనం వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకు భిన్నంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సిన్పై భయం, అపోహలు ఇంకా పోలేదు. ఇందుకు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో జరిగిన ఘటనే ఉదాహరణ. వ్యాక్సిన్ వేయడానికి వెళ్లిన అధికారులను గ్రామస్థులు తరిమి తరిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఉజ్జయిని జిల్లాలోని మెయిల్ ఖేడీ గ్రామంలో జరిగిందీ సంఘటన.
గ్రామస్థులు వ్యాక్సిన్ అంటే భయపడుతూండటంతో అధికారులు ఆ గ్రామంలో వ్యాక్సినేషన్ వేయలేక పోయారు. దీంతో గ్రామస్థుల్లో వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు ఓ బృందం అక్కడికి వెళ్లింది. వీరి రాకను ముందే గమనించిన గ్రామస్థులు వారు రాగానే కర్రలతో కొట్టబోయారు. పారిపోతున్న అధికారులను వెంబడించారు. దీంతో కొందరు కారులో పారిపోగా.. ఓ పంచాయతీ మహిళా అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.
224108 855724Gratitude for building this send! I in reality understand the no cost info. 388952
953695 752244I believe other website owners should take this internet site as an model, very clean and superb user genial design and style . 423453