గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్ కౌంటర్ తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ వికాస్ దుబే భార్య రిచా దుబే స్పందించింది. వికాస్ దుబే కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్ కౌంటర్ సరైన చర్యే అని సమర్ధించడం విశేషం.
‘వికాస్ దుబే చాలా పెద్ద నేరం చేశాడు.. అతడు ఈ శిక్షకు అర్హుడే’ అని రిచా స్పందించారు. ‘మా మాట వికాస్ ఎప్పుడూ వినలేదు. మా మాట వినుంటే అతడికి జీవితం ఇలా ముగిసేది కాదు. అతడి వల్ల పూర్వికుల నుంచి వస్తున్న ఆస్తి కోల్పోయాం. ఈ శిక్షకు వికాస్ అర్హుడే. వికాస్ ను ఇలానే వదిలేస్తే మరింత ప్రమాదం. వికాస్ ను చూసి ఇలానే మిగిలినవారు వ్యవహరించే ప్రమాదం ఉంది’ అని ఆయన తండ్రి రామ్ కుమార్ దుబే అన్నారు. కొడుకు అంత్యక్రియలకు ఆయన హాజరు కాలేదు. వికాస్ దుబే అంత్యక్రియలను కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో నిర్వహించారు. వికాస్ దుబే అంత్యక్రియకలు భార్య రిచా, కుమారుడు, బావమరిది దినేశ్ తివారి హాజరయ్యారు. దినేశ్ తివారీనే వికాస్ ఆఖరి ఘట్టం పూర్తి చేశాడు.
తనను అరెస్టు చేయడానికి వస్తున్న 8మంది పోలీసులను కిరాతకంగా కాల్చి చంపిన కేసులో గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే నిందితుడిగా ఉన్నాడు. అతడిపై 5లక్షల రివార్డు కూడా ఉంది. ఈనేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ నగరంలోని మహాకాళేశ్వరుడి ఆలయం వద్ద పట్టుబడిన సంగతి తెలసిందే. వికాస్ ను ఉజ్జయిని నుంచి కాన్పూర్ తీసుకొస్తూండగా తప్పించుకోవాలని ప్రయత్నించడంతో పోలీసులు కాల్పుల్లో వికాస్ దుబే మరణించాడు.