వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘సాక్షి మీడియా’ వుంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగా చెప్పబడే పలు న్యూస్ ఛానళ్ళు, పత్రికల విషయానికొస్తే.. అవేవీ, నేరుగా టీడీపీతో కనెక్ట్ అయి లేవు. తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతాయంతే. కానీ, సాక్షి మీడియా అలా కాదు.. అది స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.
సాక్షి మీడియా కాకుండా, చాలా మీడియా సంస్థలు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నాయి. వెబ్ మీడియాని తీసుుంటే, చాలావరకు వైసీపీ అనుకూలమే. చాలా మీడియా సంస్థల్ని వైసీపీ బతిమాలో, భయపెట్టో.. లొంగదీసుకుందన్నది బహిరంగ రహస్యం. ఇంతలా మీడియా వైసీపీకి అనుకూలంగా వున్నాసరే, ‘దుష్టచతుష్టయం’ అంటూ పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘గిట్టని మీడియా’పై మండిపడుతుంటారు. ఏమో, సాక్షి మీడియా కూడా వైసీపీ అనుకున్న స్థాయిలో రాణించడం లేదేమో.. వైసీపీకి ఆ స్థాయిలో బాకా ఊదరడంలేదేమో.!
కొత్తగా మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి తాను మీడియా రంగంలోకి వస్తున్నట్లు ప్రకటించారో, ఆ వెంటనే వైసీపీనే ఉలిక్కిపడింది. అదేంటీ, విజయసాయిరెడ్డికి సొంత మీడియా సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరమేమొచ్చింది.? అంటూ వైసీపీ మద్దతుదారులే సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలు పెట్టారు.
కొన్నాళ్ళ క్రితం అసెంబ్లీలో సన్నబియ్యం అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో, ‘సాక్షిలో తప్పు రాస్తారు అధ్యక్షా..’ అంటూ స్వయానా సాక్షి మీడియా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అలాగని, సాక్షి మీడియాకి ప్రకటనలు ఇవ్వడం మానేశారా.?
గడచిన మూడున్నరేళ్ళుగా సాక్షి మీడియా, అడ్డగోలుగా ప్రజాధనాన్ని బుక్కేస్తోందన్న విమర్శలున్నాయ్. బహుశా, ఆ ‘బుక్కెయ్యడం’లో వాటా తనకూ కావాలనుకుంటున్నారేమో.. విజయసాయిరెడ్డి సొంత మీడియా అంటున్నారు. ప్రజా ధనమే కదా, అందినకాడికి ‘మీడియా ముసుగులో’ మింగెయ్యొచ్చు.. అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయ్.
450576 656700An incredibly interesting read, I may possibly possibly not agree completely, but you do make some very valid points. 877162