ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ (PS-1)లో పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన రాబోయే చిత్రం “అమ్ము” లో కనిపించనుంది. ‘అమ్ము’ గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ గా అక్టోబర్ 19న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ చేకూరిన సంగతి తెలిసిందే. చాలా సినిమాలు ఓటీటీ విడుదలై కూడా సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది ఈ అమ్ము మూవీ.
ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ అమ్ము చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. గృహ హింసకు గురైన ఒక అమ్మాయిగా ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో కనిపిస్తుంది. నవీన్ చంద్ర ఈ సినిమాలో అమ్ము భర్తగా నటించాడు. భార్య భర్తల అనుబంధంతో పాటు వాళ్ళ మధ్య జరిగే గొడవలను కూడా ఆవిష్కరించాడు దర్శకుడు.
ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుంది. రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం ఒక డ్రామా థ్రిల్లర్ అని తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా, చారుకేష్ శేఖర్ రచన & దర్శకత్వం మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ డ్రామా థ్రిల్లర్లో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర మరియు సింహా నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ నెల 19న రానుంది.
697755 38380Visit our web site for information about securities based lending and more. There is information about stock and equity loans as effectively as application forms. 178247
92825 530077Fantastic write-up mate, keep the fantastic function, just shared this with ma friendz 273042