టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో భారీ బడ్జెట్ ఫిలిమ్స్, తెరపై గ్రాండియర్ విజువల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన సంస్థ అంటే సి. అశ్వనీదత్ గారి శ్రీ వైజయంతి మూవీస్ పేరే చెప్పుకుంటాం. దానికి సబ్ ప్రొడక్షన్ గా ఆయన కుమార్తె స్వప్న సినిమాస్ బ్యానర్ స్థాపించి సినిమాలు చేస్తోంది. ఇటీవలే ‘మహానటి’తో బ్లాక్ బస్టర్ అందుకున్న స్వప్న దత్ ఎర్లీ మాన్సూన్ టేల్స్ బ్యానర్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ లోకి కూడా అడుగు పెట్టారు.
గతంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తెలుగుకి వచ్చిన మొదట్లో స్వప్న దత్ చేసిన ‘గ్యాంగ్ స్టర్స్’, ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’ సీరీస్ లు సక్సెస్ కాలేదు. ఆ తర్వాత సీరీస్ లు చేయడంలో గ్యాప్ తీసుకున్న స్వప్న దత్ మళ్ళీ వెబ్ సీరీస్ లు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా అసలు సక్సెస్ లేక ఈ మధ్య సినిమాలకి దూరంగా ఉన్న డైరెక్టర్ ని సెలెక్ట్ చేసారు. ఆయనే ‘ఆ నలుగురు’ సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత ‘అందరి బంధువయ’, ‘ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు’, ‘ఆట గదరా శివ’ సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్న చంద్ర సిద్దార్థ్ ని ఎంపిక చేశారు.
డిజిటల్ రంగంలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అస్సలు సక్సెస్ లేని స్వప్న దత్ అసలు ఫామ్ లో లేని చంద్ర సిద్దార్థ్ ని సెలెక్ట్ చేసుకోవడం అందరికీ షాకింగ్ ఇస్తోంది. కానీ సినిమాలా మార్కెటింగ్ అనేది ఇక్కడ పెద్ద ప్రాబ్లెమ్ లేదు కాబట్టి, కంటెంట్ నచ్చడంతో ఈ సీరీస్ చేస్తున్నారని సమాచారం. ప్లాప్ డైరెక్టర్ తో ఎర్లీ మాన్సూన్ టేల్స్ బ్యానర్ లో స్వప్న దత్ ప్లాన్ చేసిన ఈ మూడో సీరీస్ అన్నా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
571509 109347Im not that significantly of a internet reader to be honest but your websites truly nice, keep it up! Ill go ahead and bookmark your site to come back later. All the finest 265854