అమరావతి ప్రాంత రైతులు తమ సమస్యల్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. ‘మీ ఆవేదనను అర్థం చేసుకోగలను.. అయితే, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే పరిస్థితుల్లో లేను..’ అని వ్యాఖ్యానించిన వెంకయ్యనాయుడు, ‘మీ సమస్యల్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలో వారి దృష్టికి తీసుకెళ్తాను..’ అంటూ నర్మగర్భంగానే అసలు విషయాన్ని స్పష్టం చేసేశారు.
‘ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలో..’ అంటే, ఇంకెవరి దృష్టికి.. కేంద్రం దృష్టికే.! అయితే, కేంద్రం దగ్గర వెంకయ్యనాయుడు మాట చెల్లే పరిస్థితి వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకప్పుడు వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్ నేత. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. కేంద్ర మంత్రిగానూ పలుమార్లు సేవలందించారు.
అయితే, ప్రత్యేక హోదా సహా.. విభజన హామీల అమలు విషయమై ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకీ, అటు కేంద్ర ప్రభుత్వానికీ మధ్య నలిగిపోయిన వెంకయ్యకు, ఉపరాష్ట్ర పదవినిచ్చి ప్రధాని నరేంద్ర మోడీ ఉపశమనం కల్పించారు. అయితే, ఇప్పుడు అమరావతి సమస్యకు సంబంధించి నరేంద్ర మోడీకి కూడా కొంత బాధ్యత వుందన్నది నిర్వివాదాంశం.
ఎందుకంటే, ఆయనే అమరావతికి శంకుస్థాపన చేశారు. పైగా, ఢిల్లీని తలదన్నేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి మోడీ వుంటారని అమరావతి రైతులు నమ్ముతున్నారని అనుకోవాలి. అయితే, ప్రత్యేక హోదాపై కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతిలో హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ, ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయిన దరిమిలా, అమరావతి రైతుల వెతల్ని ఆయన పట్టించుకుంటారని ఎలా అనుకోగలం.?
882155 447369I discovered your site internet site online and check a lot of of your early posts. Keep on the top notch operate. I just now additional your Feed to my MSN News Reader. Searching for forward to reading a lot a lot more from you finding out later on! 518443