ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రాథమిక బాధ్యత అని, దానిని విస్మరించొద్దని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి నుంచి ట్విట్టర్ లో వీడియో సందేశం పోస్టు చేశారు.
తన ఆరోగ్యం గురించి అందరికి ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి దీవెనలతో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వస్తానని పేర్కొన్నారు. కరోనా బాధితుల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గాంధీ భవన్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. వారందరినీ ఆయన అభినందించారు.
కరోనా బారిన పడినవారికి సరైన వైద్య సేవలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ఆ దృశ్యాలన్నీ హృదయవిదారకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పడకలు దొరక్క, ఆక్సిజన్ లేక, రెమిడిసివిర్ ఇంజక్షన్లు దొరక్క కరోనా బాధితులు పడుతున్న బాధలు దారుణంగా ఉన్నాయన్నారు. కరోనా చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
669571 206559I cant say that I completely agree, but then once again Ive never genuinely thought of it quite like that before. Thanks for giving me something to consider when Im supposed to have an empty mind while trying to fall asleep tonight lol.. 243927