మరో అయిదు రోజుల్లో అన్ లాక్ 4 కు సంబంధించిన మర్గదర్శకాలు విడుదల కావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం వాటిని రెడీ చేసింది. సెప్టెంబర్ 1వ తారీకు నుండి అమలులోకి రావాల్సిన అన్ లాక్ 4 గురించి చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు.
ముఖ్యంగా థియేటర్ల విషయంలో ఒక స్పష్టత వస్తుందని మాల్స్ మరియు థియేటర్లు తెరుచుకునేందుకు ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుందని అనుకున్నారు. కాని అన్ లాక్ 4 కూడా వాటికి తాళం వేసే ఉంచబోతుంది.
అన్ లాక్ 4 లో భాగంగా మెట్రో రైళు మరియు బార్ లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వబోతుంది. సెప్టెంబర్ 1వ తారీకు నుండి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలు మరియు నగరాల్లో మెట్రో రైళ్లు కూత పెట్టబోతున్నాయి. ఇదే సమయంలో బార్స్ మరియు కొన్ని వ్యాపార సముదాయాలను కూడా ఓపెన్ చేయవచ్చు అంటూ అనుమతులు రాబోతున్నాయి.
ప్రధానంగా అయితే మెట్రో మరియు బార్ లకు అనుమతులు. బార్ లలో అమ్మకాలు మాత్రమే జరపాలని సిట్టింగ్స్ కు నో పర్మీషన్ గా తెలుస్తోంది. థియేటర్ల ఓపెన్ కు మరియు స్కూల్స్ ఓపెన్ కు అక్టోబర్ 1 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.
603000 222452Would really like to always get updated fantastic site ! . 289214