జనసేనాని పవన్ కల్యాణ్ పై రెక్కీ నిర్వహించారనే అంశం వివాదాస్పద అంశమని.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇంతవరకూ ఆయన అధికారంలో లేరు కాబట్టి తాను పవన్ ను విమర్శించనని అన్నారు. పలు విషయాలపై ఆయన స్పందిస్తూ..
‘చంద్రబాదు రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు నేను వ్యతిరేకించాను. దీనిపై భ్రమరావతి అనే పుస్తకం కూడా రాశాను. జగన్ కూడా రాజధాని అమరావతిని నాడు వ్యతిరేకించి ఉంటే నేడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. రైతులూ భూములు ఇచ్చేవారు కాదు. మూడు రాజధానులనేది కొత్త ప్రతిపాదన. సుప్రీంకోర్టు దీనిని తేలుస్తుంది.
పోలవరం అంత అర్రీ బుర్రీగా తేల్చే విషయం కాదని ఇరిగేషన్ మంత్రి అన్న మాటలను నేను స్వాగతిస్తున్నాను. ‘రాష్ట్ర పరిస్థితిపై ‘విభజన వ్యధ’ అనే పుస్తకం రాస్తున్నాను. చరిత్ర రికార్డు అవ్వాలని.. అందరికీ తెలియాలనే రాస్తున్నాను. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు కోర్టులో స్టేలు మాత్రం వస్తున్నాయి.. న్యాయపరంగా నిరూపించలేక పోతోంది’ అని అన్నారు.
4197 863764There is noticeably a bundle to realize about this. I assume you created specific nice points in functions also. 935382
171355 658647stays on topic and states valid points. Thank you. 315362
363347 171869Wow! This could be one specific of the most useful blogs Weve ever arrive across on this subject. Basically Superb. Im also an expert in this subject therefore I can recognize your effort. 370055