Switch to English

చిరంజీవి వెనుక ఆ ఇద్దరూ ఉన్నారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో, దీనిపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటన సైతం అంతే సంచలనం రేపింది. తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విధానానికి విరుద్ధంగా, మూడు రాజధానులకు అనుకూలంగా చిరంజీవి ప్రకటన చేయడం జనసేనకు ఇబ్బందిగా పరిణమించింది.

దీంతో జన సైనికులు ఆ ప్రకటన ఫేక్ అంటూ చిరంజీవే ఖండన ప్రకటన విడుదల చేసినట్టుగా ఓ లేఖను వైరల్ చేశారు. దీంతో మళ్లీ చిరంజీవి రంగంలోకి దిగి తాను మొదట చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నానని, తన పేరుతో వచ్చిన రెండో ప్రకటన ఫేక్ అంటూ మరో ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చారు. అయితే, ఇది కూడా మిమిక్రీ అంటూ పలువురు ఆరోపించారు.

వాస్తవానికి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి అకస్మాత్తుగా ఏపీ రాజధానుల వ్యవహారంపై ఎందుకు స్పందించారా అనే అంశంపై జోరుగా చర్చ సాగింది. ఆయన విశాఖలో స్టూడియో కట్టాలని భావిస్తున్నారని, అందుకే ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు మూడు రాజధానులకు అనుకూలంగా ప్రకటన చేశారని ఆరోపణలు వచ్చాయి.

కానీ రాజధాని హోదాతో సంబంధం లేకుండా విశాఖపట్నం ఎప్పుడో అభివృద్ధి చెందింది. విజయవాడతో పోలిస్తే విశాఖ పెద్ద నగరం కావడమే కాకుండా అన్ని విధాలా అనుకూలమైన ప్రదేశమే. ఈ నేపథ్యంలో రాజధాని అయితేనే చిరంజీవి అక్కడ స్టూడియో కడతారని భావించడం సరికాదని అంటున్నారు.

చిరంజీవి ఆ ప్రకటన చేయడానికి ముఖ్యం కారణం ఆయనకు సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తులని సమాచారం. వారిలో ఒకరు మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కాగా, మరొకరు మంత్రి కన్నబాబు. వీరిద్దరే చిరంజీవిని ఒప్పించి రాజధానికి అనుకూలంగా ప్రకటన చేయించారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైఎస్సార్ సీపీలోకి రావాలని భావిస్తున్న గంటా శ్రీనివాసరావు తన పట్టు నిరూపించుకుని జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేయడానికి చిరంజీవితో ఈ ప్రకటన చేయించారని అంటున్నారు. అదే సమయంలో కన్నబాబు సైతం పార్టీలో తన పట్టు నిలబెట్టుకోవడానికి ఈ విషయంలో చిరంజీవితో సంప్రదింపులు జరిపారని చెబుతున్నారు. మొత్తానికి వీరిద్దరి సూచనలతోనే చిరంజీవి తన తమ్ముడితో విభేదించి మరీ రాజధానికి అనుకూలంగా ప్రకటన చేశారని తెలుస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...