ఎన్నో పథకాలు, మరెన్నో హామీలతో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ.. సంక్షేమ పథకాలకు కత్తెర వేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలే పీకల్లోతు అప్పులు, దానికి తోడు ప్రజాకర్షక పథకాలకు భారీ మొత్తం వెచ్చించాల్సి రావడం వంటి పరిణామాలతో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. అప్పు చేస్తే గానీ నెల గడవని పరిస్థితిలో ఏపీ ఖజానా ఉంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమల్లో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనక్కి తగ్గకుండా క్రమం తప్పకుండా ఏదో ఒక పథకం ప్రారంభిస్తూనే ఉన్నారు. అయితే, వీటన్నింటికీ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సంక్షేమ పథకాల కత్తిరింపు దిశగా అధికార పార్టీ ఆలోచనలు సాగుతున్నాయి. కరెంటు బిల్లుతో సంక్షేమ పథకాల భారం తగ్గించుకోవాలని యోచిస్తోంది. కరెంటు వాడకాన్ని బట్టి ఆ కుటుంబం పొందుతున్న ప్రయోజనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
కరెంటు వాడకం 200 యూనిట్లు దాటితే రేషన్ కార్డు కట్ అవుతుంది. అదే 300 యూనిట్లు పైబడితే పెన్షనర్ల పింఛన్లకు రెక్కలొచ్చినట్టే. పైగా ఒకరి పేరు మీద ఉన్న వేర్వేరు కరెంటు కనెక్షన్లన్నీ కలిసి ఒక యూనిట్ గా పరిగణిస్తారు. అంతేకాకుండా భార్యాభర్తల పేరు మీద ఉన్న సర్వీసులను సైతం కలిపి ఒకటిగానే చూస్తారు. అంటే.. ఎలా చూసినా షాక్ ఖాయం అన్నమాట.
ఇక ఆటోలతోపాటు ట్రాక్టర్లు, ట్యాక్సీలు మినహా నాలుగు చ్రకాల వాహనాలున్న వారికి రేషన్ కార్డు తీసేస్తారు. ఇంటి మీద అద్దె పొందుతున్న పెన్షనర్లకు పింఛను కూడా ఎత్తేస్తారు. మొత్తానికి సంక్షేమ పథకాల భారం తగ్గించుకునేందుకు కీలక మార్పులకు ఏపీ సర్కారు నడుం బిగించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం. ఈ నిర్ణయంపై విమర్శలు, వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
937708 150668Extremely fascinating subject , regards for putting up. 571373
890703 388025Hi there! I merely want to give a huge thumbs up for the good data you could have proper here on this post. I will likely be coming once more to your weblog for far more soon. 946084
327040 553342Hey there! Good stuff, please maintain me posted when you post something like this! 372478