కరోనా మనుషుల్ని బలి తీసుకోవడమే కాదు.. మనుషుల్లోని మానవత్వాన్ని కూడా హరించేస్తోంది. ఇందుకు సాక్ష్యంగా నిలిచే సంఘటన తమిళనాడులోని చెన్నైలోని కుండ్రత్తూర్ ప్రాంతంలో జరిగింది. స్థానికంగా ధనరాజ్ అనే వ్యక్తి కుటుంబంతో సహా గుణశేఖర్ అనే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో ఆరు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. ధనరాజ్ కు అజిత్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతను వాటర్ ట్యాంకర్ క్లీనర్ గా పని చేస్తున్నాడు.
కరోనా నేపథ్యంలో నెలకు 4వేల అద్దెను నాలుగు నెలలుగా చెల్లించటం లేదు. దీంతో గుణశేఖర్ కొన్ని రోజులుగా అద్దె కోసం ఒత్తిడి చేస్తున్నాడు. అనేకసార్తు వాదనల మధ్య రెండు విడతల్లో అద్దె చెల్లిస్తాననే ఒప్పందం కూడా జరిగింది. అయితే రోజులు గడుస్తున్నకొద్దీ అద్దె చెల్లించకపోవడంతో గుణశేఖర్ ఈ బుధవారం మళ్లీ గొడవ పడ్డాడు. అజిత్ లేని సమయంలో అతని తల్లితో అద్దె కోసం వాదనకు దిగాడు. రాత్రి ఇంటికి వచ్చిన అజిత్ కు జరిగిన గొడవ గురించి చెప్పారు కుటుంబసభ్యులు.
కోపోద్రిక్తుడైన అజిత్ ఆవేశంతో అర్ధరాత్రి పదునైన కత్తితో గుణశేఖర్ ఇంట్లోకి చొరబడ్డాడు. భయపడిపోయిన గుణశేఖర్ ఇంట్లో నుంచి బయటకు పరుగు తీశాడు. అజిత్ అతన్ని వెంబడించి కత్తితో గుణశేఖర్ గొంతులో పొడిచాడు. దీంతో గుణశేఖర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అజిత్ ను అదుపులోకి తీసుకున్నారు. అజిత్ పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
800477 786967Every email you send need to have your signature with the link to your web internet site or weblog. That usually brings in some visitors. 661574
849801 148915bathroom towels really should be maintained with a excellent fabric conditioner so that they will last longer:: 120235