‘తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే ఆంధ్రాలో మూడెకరాలు కొనొచ్చు. రాష్ట్రంలో రూ.10 లక్షలకు ఎకరం వచ్చే పరిస్థితి లేదు’ – ఇవీ ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది. మరి ఈ లెక్క వివిధ ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులకు మాత్రం వర్తించడంలేదు. రాష్ట్రంలో పలుచోట్ల సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, గ్రావిటీ కాల్వల నిర్మాణం కోసం రైతుల నుంచి పెద్దమొత్తంలో ప్రభుత్వం భూములు సేకరించింది. అందుకు బదులుగా వారికి నష్టపరిహారంగా నగదుతోపాటు కొందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ అవేవీ అమలు కావడంలేదు. ములుగు జిల్లా రామప్ప-లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణం కోసం రైతుల నుంచి 145 ఎకరాలు సేకరించారు.
ఆ సందర్భంగా ఎకరాకు రూ.8.6 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తీరా ఇప్పుడు రూ.2.47 లక్షలు మాత్రమే ఇస్తానని చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం ధర రూ.15 లక్షల పైమాటే. ఇక్కడ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలు ఇస్తుండగా.. మరికొన్ని చోట్ల రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు మాత్రమే ముట్టజెబుతున్నారు. ఇక నిర్మాణాలు పూర్తయిన చాలాచోట్ల ఇప్పటికీ నయాపైసా పరిహారం అందని రైతులు చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా తమకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే కోర్టుకు వెళతామని పలువురు నిర్వాసితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారు.
819213 637435You completed various excellent points there. I did a search on the theme and located the majority of folks will consent with your blog. 208889
460710 375620you can have a amazing weblog here! would you wish to make some invite posts on my weblog? 722496
974924 951958Your write-up is truly informative. A lot more than that, it??s engaging, compelling and well-written. I would desire to see even far more of these types of great writing. 543425