Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: టీడీపీ పూర్తిగా ఆశలొదిలేసుకున్నట్లే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి ఏమయ్యింది.? తెలంగాణపై ఆశలు వదిలేసుకున్నట్లే, ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనూ తెలుగుదేశం పార్టీలో నిస్తేజం అలముకుందా.? పార్టీకి నేతలు ఒకరొకరుగా దూరమవుతోంటే.. డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎందుకు వ్యూహరచన చేయలేకపోతున్నారు.? రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మరిన్ని షాక్‌లు తినబోతోందా.? ఈ ప్రశ్నలిప్పుడు తెలుగు తమ్ముళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

టీడీపీ నుంచి కొందరు ముఖ్య నేతలు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు.. కొందరేమో పలు కేసుల్లో చిక్కుకుపోయి నానా తంటాలూ పడుతున్నారు.. మిగిలినోళ్ళలోనూ చాలామంది వేరే పార్టీల్లోకి వెళ్ళేందుకు ‘సరైన సమయం’ కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ చూడని సంక్షోభమిది. అన్నట్టు, తెలుగుదేశం పార్టీకి ‘ఆగస్ట్‌ సంక్షోభం’ అనే ఓ సెంటిమెంట్‌ వుండనే వుంది. ఆ లెక్క, ఈ ఆగస్టులో తెలుగుదేశం పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనబోతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నెలలోనే మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరబోతున్నారట. మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలూ ఇదే బాటలో పయనించబోతున్నారంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో టీడీపీ నేతలు బయటకొచ్చేందుకు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అయితే, కరోనాతోపాటు ఇతరత్రా కారణాలతోనూ టీడీపీ నేతలు ‘సైలెంట్‌’ అయిపోవడానికి కారణమన్న చర్చ జరుగుతోంది.

తన సోదరుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్టు విషయంలో మొదట్లో రంకెలు వేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి ఇప్పుడు పూర్తిగా సైలెంటయిపోయారు. అచ్చెన్నాయుడు విషయంలో ‘కింజరాపు’ కుటుంబానిదీ ఇదే పరిస్థితి. కొల్లు రవీంద్ర విషయంలోనూ టీడీపీ నేతలు పూర్తిగా లైట్‌ తీసుకున్నారన్న వాదనలు లేకపోలేదు. ‘ఎప్పుడు ఎవరి అరెస్ట్‌ గురించి వినాల్సి వస్తుందో.!’ అన్న భయం టీడీపీ నేతల్లో పెరిగిపోతున్న దరిమిలా, రాజకీయంగా తమను తాము కాపాడుకునేందుకు టీడీపీని వీడటం తప్ప చాలామంది తెలుగు తమ్ముళ్ళకు ఇంకో దారి కన్పించడంలేదు.

2024 వరకూ కాదు.. ఈలోగానే, అందునా ఈ ఏడాది లోనే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఖతం అయిపోతుందని వైసీపీ వర్గాలు జోస్యం చెబుతుండడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...