‘బాహుబలి’ సినిమా తర్వాత భారీ బడ్జెట్ తో వస్తున్న పీరియాడికల్ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషలకి చెందిన స్టార్ హీరోస్ అయిన అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతిబాబు, అనుష్క, నయనతార, తమన్నాలు నటిస్తున్నారు అనగానే ‘సైరా’కి చాలా క్రేజ్ వచ్చింది. కానీ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని, రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్ర టీం చేస్తున్న తప్పులు సినిమా మీద క్రేజ్ ని తగ్గేలా చేస్తున్నాయి.
ఎలా అనే విషయంలోకి వెళితే.. ముందుగా చాలా విషయాల్లో రాంగ్ పబ్లిసిటీతో క్రేజ్ తీసుకు రావాలని చూసారు, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో రాంగ్ అప్డేట్స్ ముందు చలామణిలోకి వచ్చి తర్వాత అంతా రాంగ్ నెంబర్స్ చెప్తున్నారని చెప్పి సినిమాపై నెగటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అంత బడ్జెట్, స్టార్స్ ఉన్న సినిమాకి ఇలా నెగటివ్ పబ్లిసిటీ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారో అని పలువురు పెదవి విరుస్తున్నారు.
ఇది కాకుండా, ఇటీవలే విడుదలైన ‘సైరా’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఆ ట్రైలర్ తర్వాత సినిమాకి సంబందించిన ప్రమోషన్ ఒక్కటి లేదు. అసలు అంత పెద్ద సినిమా ప్రమోషనల్ టీం, ఏం చేయకుండా నిద్రపోతున్నారా అని మెగా అభిమానులు అంటున్నారు. సెప్టెంబర్ 22న ఎల్.బి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు, కానీ ఈ విషయం గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద హల్ చల్ చేయడం లేదు. చిన్న హీరోల సినిమాలకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే రెండు మూవుడు రోజుల ముందు నుంచి హడావిడి ఉంటది కానీ సైరా లాంటి సినిమాకి అసలు బజ్ లేదు. ఇలా తప్పు మీద తప్పు చేస్తున్న సైరా టీం, ఇకనైనా మేలుకొని సరైన రీతిలో ప్రమోషన్స్ చేయాలనీ కోరుకుందాం.
