దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వప్నా సురేశ్ చేసిన బంగారం అక్రమ రవాణా కేసులో తవ్వేకొద్దీ ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఏడో తరగతి మాత్రమే చదివి ఏకంగా కేరళ ఐటీ విభాగంలో జాబ్ కొట్టేయడమే కాకుండా ఐఏఎస్ అధికారికి కూడా సన్నిహితమైన ఈ భామ బాగోతం ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తుండటంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. దౌత్య కార్యాలయంలో పనిచేసిన అనుభవంతో బంగారం అక్రమ రవాణా ఎలా చేయొచ్చో తెలుసుకున్న ఈమె.. సరిత్, సందీప్ నాయర్ లతో జట్టు కట్టి ఈ అక్రమ రవాణాకు తెరతీసింది.
గత ఏడాది కాలంగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 23 సార్లు 152 కిలోల బంగారాన్ని అక్రమ మార్గంలో చేరవేసినట్టు గుర్తించారు. అంటే నెలకు దాదాపు రెండు కన్ సైన్ మెంట్లు వచ్చేవన్న మాట. దుబాయ్ నుంచి కేరళ త్రివేండ్రంలోని దౌత్య కార్యాలయానికి ఎక్కువగా వచ్చే ఫుడ్ పార్శిళ్లలో బంగారం కడ్డీలను పెట్టి పంపించేవారు. ఈ పనిని దుబాయ్ లో ఫరీద్ అనే వ్యక్తి చూసేవాడు. అలా వచ్చిన పార్శిళ్లను స్వప్న బృందం కేరళలోని బంగారం వర్తకులకు చేరవేసేవారు. ఇందుకోసం ఒక్కో కన్ సైన్ మెంట్ కు స్వప్నకు రూ.15 లక్షల వరకు అందేవి. సరిత్ కు రూ.10 లక్షలు దక్కేవి. తొలుత పది నుంచి 15 కిలోల బంగారం తీసుకొచ్చేవారు. కానీ మొన్న మాత్రం ఒకేసారి 30 కిలోలు తీసుకొచ్చి బుక్కయ్యారు.
ఈ బంగారానికి సంబంధించిన సొమ్మును హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో దుబాయ్ పంపించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించి ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. ఈ విషయంలో కొందరు అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎలాంటి సంచలన విషయాలు బయట పడతాయో అనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు మాత్రం వణికిపోతున్నారు. దర్యాప్తు తీగ తమ మెడకు ఎప్పుడు ఎలా చుట్టుకుంటుందో అని భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే యూఏఈకి చెందిన రషీద్ దుబాయ్ వెళ్లిపోగా.. ఓ పోలీసు సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేశాడు.
363261 909543Hey! Great stuff, do tell us when you lastly post something like this! 730720
777910 540002conclusion that you are definitely proper but some require to be 438202