2013లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చిన వరదలు ఎంతటి విధ్వంసం సృష్టించాయో తెలిసిందే. కేదార్ నాధ్ పుణ్యక్షేత్రాన్ని చుట్టుముట్టిన ఆ వరద ఎంతో భీభత్సం సృష్టించింది. ఆ వరదలను తలపిస్తూ మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో ఆకస్మిక వరద కలకలం రేపుతోంది. చమోలి జిల్లాలోని ధౌలిగంగా నదిలో నందాదేవి గ్లేసియర్ విరిగి పడిపోవడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో హరిద్వార్, రుషికేశ్ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. దీంతో యూపీలోని గంగా పరివాహక ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు.
ఈ విపత్తుతో రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు ధ్వంసమైంది. ఈ వరద తాకిడకి ఇక్కడ పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారని తెలుస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. 200 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆఘమేఘాల మీద సహాయక చర్యలు చేపట్టారు. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
238454 71058Utterly composed subject material , thanks for selective info . 181593
210735 89648I think this internet site contains some very excellent information for everybody : D. 481352
4317 153607I think one of your ads triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 823212