యాచకులతో యాచించడం మాన్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. జైపూర్ లోని యాచకులకు వసతి, యోగా, ఆటలు, కంప్యూటర్ నైపుణ్య తరగతుల్లో శిక్షణ ఇస్తూ రోజుకు 215 రూపాయల ఉపకారవేతనం ఇస్తోంది. రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీ హుడ్స్ డెవలెప్మెంట్ కార్పొరేషన్.. సోపన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంయుక్తంగా ఈ బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ప్రవేశపెట్టనున్నారు. రాజస్థాన్ ను బెగ్గర్ ఫ్రీ స్టేట్ గా మార్చాలనే సీఎం అదేశాలకు తగ్గట్టు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ జైపూర్ లోని 43 మంది యాచకులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. మిగిలిన వారితో యాచకుల మానసిక, శారీరక స్థితి ఉంటుందని.. వాటికి అనుగుణంగా వారికి తర్ఫీదు ఇస్తున్నామంటున్నారు నిర్వాహకులు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చినవారని తెలిపారు. కౌశల్ వర్ధన్ అనే కేంద్రం ద్వారా బ్యాచుల ద్వారా వారికి శిక్షణ అందిస్తున్నారు.
468990 668585This site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll definitely discover it. 178413
947561 681824When visiting blogs, i typically discover a extremely great content like yours 102239