కరోనా అనేది మనిషిలోని మానవత్వం చంపేస్తుందని మనం మళ్లీ మళ్లీ చెప్పుకుంటున్నాం. మీడియాలో ఎంతగా వార్తలు వస్తున్నా కూడా కరోనా కారణంగా కొందరు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్ల బస్స్టాండ్లో ఒక వృద్దురాలిని వదిలి వెళ్లారు. ఆమె కొడుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను అక్కడ వదిలేసి వెళ్లి పోయాడు. విషయం తెలిసిన అధికారులు మరియు పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను హాస్పిటల్కు తరలించారు.
పోలీసులు మరియు అధికారులు ఎంతగా చెబుతున్నా కూడా కరోనా రోగుల పట్ల ఇంకా అదే వ్యతిరేకతను జనాలు వ్యక్తం చేయడం దారుణం. కన్న తల్లిని కరోనా భయంతో బస్స్టాండ్లో వదిలేసిన ఆ కొడుకును పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తొస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె గోవా నుండి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు కరోనా సోకినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటుందని వైధ్యులు తెలియజేశారు.
191805 183180Thank you for sharing with us, I conceive this web site truly stands out : D. 422823
971593 800802Taking a look forward to see you. 669056