తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీపై ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ద్రోహం చేసిన కేసీఆర్ కు ఏపీకి వచ్చే అర్హత లేదని అన్నారు. జాతీయస్థాయిలో పార్టీ పెట్టే హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు. ఆంధ్రులను ద్రోహులుగా వర్ణించిన కేసీఆర్ ఎలా ఓట్లు అడుగుతారని అన్నారు. ఆరెఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పై ఆయన వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. ముందు తన ఇంటిని శుభ్రపరుచుకోవాలని అన్నారు.
కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకున్నారని ఆరోపించారు. తెలంగాణలోనే టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చేసేదేమీ లేదని అన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్.. వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.
384094 580773really nice post, i definitely enjoy this fabulous website, persist with it 507269
909787 386557Music started playing anytime I opened this web website, so annoying! 785469