సీనియర్ రెసిడెంట్ వైద్యుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. వారి స్టైఫండ్ ను 45వేల నుంచి 70వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారి డిమాండ్లను సీఎస్ వద్ద చర్చించినట్టు తెలిపారు. స్టైఫండ్ పెంపు నిర్ణయంతో ఆందోళన విరమించాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై మాట్లాడారు. ఆస్పత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో పడకల ఖాళీలు పెరుగుతున్నాయన్నారు. కరోనా బాధితుల డిశ్చార్జిల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. 104 కాల్ సెంటర్ కు ఫోన్ కాల్స్ క్రమంగా తగ్గుతున్నాయని కూడా అన్నారు. రాష్ట్రంలో నిన్నటి వరకూ కోటి 8 వేలకు పైగా డోసులు ఇచ్చామన్నారు. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించామని వారి పాస్ పోర్టు నెంబర్లు ఇవ్వాలని సింఘాల్ కోరారు.
95778 484816When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this post. 376351