ఏకంగా వరుసగా ఆరు పరాజయాలతో టెన్షన్ పడ్డాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. దాంతో అతగాడి కెరీర్ కి పులిస్టాప్ పడ్డట్టే అంటూ ప్రచారం కూడా జరిగింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని అటు మేక్ ఓవర్ తో పాటు తన పేరును మార్చుకుని మరోసారి చిత్రలహరి సినిమాతో ప్రయత్నం చేసాడు. ఈ సారి తన ఫ్లాప్ రికార్డును బద్దలు కొడుతూ చిత్రలహరి మంచి విజయం అందుకుంది. ఆ సక్సెస్ తో నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్త పడ్డాడు సాయి తేజ్. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే సినిమా చేస్తున్న సాయి తేజ్ పై రోజు రోజు కు ప్రేమ్ కహానీలు ఎక్కువవుతూనే ఉన్నాయి.
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సమయంలో హీరోయిన్ రెజినా తో కలిసి నటించడంతో ఇద్దరు మధ్య ఘాటు ప్రేమాయణం సాగిందని ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి .. ఆ తరువాత ఏమైందో కానీ ఇద్దరు దూరం అయ్యారు. తాజగా సాయి తేజ్ హీరోయిన్ రాశి ఖన్నా తో ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.
Also Read: బెల్లం శ్రీదేవితో మెగా మేనల్లుడు ఆ మ్యాజిక్ చేస్తాడా?
తాజగా ఓ ఇంటర్వ్యూ లో సాయి తేజ్ స్పందించాడు. తనపై ప్రేమ పుకార్లు ఎక్కువయ్యాయాని అంటున్నాడు. అంతే కాదు తనను బ్యాచ్ లర్ గా ఉండనీయం లేదంటూ చెప్పాడు. నిజానికి నాతో నటిస్తున్న హీరోయిన్స్ అంతా . .రాశి ఖన్నా, రెజినా, రకుల్ వీళ్లంతా నాతో చాలా క్లోజ్ గా ఉంటారు. అందువల్ల వాళ్లతో లవ్ లో పడ్డానని ప్రచారం జరుగుతుంది.
నిజానికి మేమంతా మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పేసాడు. తాను సినిమాల్లోకి రాకముందే ఓ అమ్మాయిని ప్రేమించానని, కానీ ఆ ప్రేమకు బ్రేక్ అప్ అయిందని, ఆ తరువాత ఆ అమ్మాయి వేరే వ్యక్తితో పెళ్ళయిపోయిందని చెప్పేసాడు. ఇప్పటికి నేను ఎవరిని ప్రేమించడం లేదని చెప్పాడు. అంతే కాదు .. ఈ పుకార్లు ఆగాలంటే .. నా పెళ్లి తోనే వాటికి పులిస్టాప్ పడుతుందేమో అంటూ ఘాటు కామెంట్ చేసాడు మెగా హీరో సాయి తేజ్.
692578 395942Companion, this web website will be fabolous, i merely like it 995315
931689 906809A blog like yours really should be earning significantly money from adsense.~::- 734597
431356 429654But a smiling visitant here to share the love (:, btw great style and style . 222867