అప్పట్లో టీడీపీ అను‘కుల’ మీడియా.. ఇప్పుడేమో వైసీపీ అను‘కుల’ మీడియా.! మిగతాదంతా సేమ్ టు సేమ్.! అధికారంలో ఎవరుంటే, వారికి అను‘కుల’ మీడియాగా ముద్రపడ్డ ఆయా మీడియా సంస్థలు, ఆయా ప్రభుత్వాల్ని శాసించేస్తున్నాయ్.! నిజంగానే శాసించేస్తున్నాయా.? అంతేననుకోవాలేమో.!
అసలు విషయానికొస్తే, 2019 ఎన్నికల సమయం.. ఎవరికి టీడీపీ టిక్కెట్ ఇవ్వాలి.? ఎవరికి ఇవ్వకూడదు.? అన్న విషయమై టీడీపీ అను‘కుల’ మీడియానే అంతా డిసైడ్ చేసేసింది. టీడీపీ అను‘కుల’ మీడియాలో కథనాలు రావడం, అందుకు తగ్గట్టే వ్యవహారమంతా నడవడం చూశాం.
ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే జరుగుతోంది. కాకపోతే, ఈసారి వంతు వైసీపీ అను‘కుల’ మీడియాది.! టీడీపీకి సొంతంగా మీడియా సంస్థల్లేవు. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలున్నాయి. వైసీపీకి ఆ సమస్య లేదు. సొంతంగా మీడియా సంస్థలున్నాయి వైసీపీకి. వాటికి అనుబంధంగా కొన్ని ‘పెయిడ్ మీడియా సంస్థలూ’ వైసీపీ కోసం పని చేస్తున్నాయ్.
ఈ వైసీపీ అను‘కుల’ మీడియా సంస్థల కథనాల ప్రకారమే అన్నీ జరుగుతున్నాయ్. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అలియాస్ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టిక్కెట్టు లేదనే ప్రచారం జరిగింది. ఆయన ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ రాజీనామా చేసేశారు.
ఇప్పుడిక, మంత్రి రోజా వంతు.! వచ్చే ఎన్నికల్లో రోజాకి టిక్కెట్ ఇవ్వకూడదని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసేసుకుందని వైసీపీ అను‘కుల’ మీడియాలో కథనాలు షురూ అయ్యాయి. వాస్తవానికి, నగిరి నియోజకవర్గంలో మొదటి నుంచీ రోజాకి వ్యతిరేకంగా ఓ వర్గాన్ని వైసీపీ అధినాయకత్వం ప్రోత్సహిస్తూ వచ్చింది.
సో, మంత్రి రోజా.. ఈసారి వైసీపీ నుంచి టిక్కెట్ దక్కించుకోవడం దాదాపు అసాధ్యమన్నమాట.! తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనాలకు సంబంధించి మంత్రి రోజాపై చాలా చాలా ‘వీఐపీ’ ఆరోపణలున్న సంగతి తెలిసిందే.