‘అయినను పోయి రావలె హస్తినకు..’ అనే మాట మన తెలుగు రాజకీయాలకి సరిగ్గా సూటవుతుంది. డిల్లీ పెద్దలు తెలుగు రాష్ట్రాల్ని అస్సలేమాత్రం పట్టించుకోరన్న మాట ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో వున్నదే. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ కారణంగానే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. అయినాగానీ, మార్పు రాలేదు.. రాబోదు కూడా.! పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉత్తరాదికి తరలిపోతుంటాయి.. లేదంటే, దక్షిణాదిన ఎంపిక చేసిన రాష్ట్రాలకు మాత్రమే దక్కుతుంటాయి. తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడూ పప్పూ బెల్లం పథకాలు మాత్రమే దక్కుతాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి దక్కిన ప్రత్యేక హోదా హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే వున్నాయి. చంద్రబాబు గతంలో ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళారు.. వచ్చారు.. ఉపయోగమేమీ లేదు. కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఢిల్లీకి వెళుతున్నారు, వస్తున్నారు.. నో యూజ్. తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డిల్లీ బాట పట్టారు. వైఎస్ జగన్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. తె
లుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా సమస్యలున్నాయని ముందే చెప్పుకున్నాం. ఆ సమస్యల పరిష్కారంలో జగన్ – కేసీఆర్ చొరవ చూపుతున్న మాట వాస్తవమే. కానీ, ఇప్పటిదాకా జరిగిన చర్చల్లో తెలంగాణకు మేలు జరిగింది తప్ప ఆంధ్రప్రదేశ్కి పైసా లాభం లేకుండా పోయింది. కృష్ణానదికి గోదావరి నీటి తరలింపుకి సంబంధించి తెలుగు రాష్ట్రాలు బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. కేసీఆర్, వైఎస్ జగన్ల ఢిల్లీ టూర్ వెనుక ఎజెండా కూడా ఇదేనట. కానీ, కేంద్రం అందుకు సుముఖంగా లేదు. కేంద్రం ఆలోచనలు వేరేలా వున్నాయి.. నదుల అనుసంధానానికి సంబంధించి.
సో, ‘అయినను పోయి రావలె హస్తినకు..’ అన్నట్లు తప్ప, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళి సాధించేదేమీ వుండదు. ‘ప్రత్యేక హోదా’ విషయంలో అయితే, వైఎస్ జగన్ ఎప్పుడో నరేంద్ర మోడీకి ‘జీ హుజూర్’ అనేశారు. సో, ఇప్పుడూ ఆయన ‘అడుగుతాం, అంతకంటే ఏం చేయగలం.?’ అని మాత్రమే చెబుతారు డిల్లీ వెళ్ళి మీడియాతో మాట్లాడితే గనక. అంతకు మించి, జగన్ ఢిల్లీ టూర్ నుంచి ఏమీ ఆశించలేం.
975340 678466fantastic post. Neer knew this, thanks for letting me know. 610818
987789 160195Just added this blog to my favorites. I enjoy reading your blogs and hope you maintain them coming! 581547