వైఎస్ రాజధాని పేరుతో తేనెతుట్టెను కదిపి చేతులు కాల్చుకున్నారా అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గత ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టును ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా మంత్రులు, అధికారుల కోసం వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. ఏమైందో ఏమో తెలియదుగాని, ఎన్నికలు ముగిసి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని విషయంలో అసంతృప్తితో ఉన్నారు.
ఎలాగైనా సరే రాజధానిని మార్చాలి అనే తలంపుతో ఉన్నారు. ఇందులో భాగంగానే రాజధానిని మార్చేందుకు సిద్ధం అయ్యారు. దీనిపై జగన్ అధికారికంగా ప్రకటన చేయకపోయినా… సూచనా మాత్రంగా ప్రకటించారు. దీంతో అమరావతి భగ్గుమన్నారు. అటు రాయలసీమ కూడా ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం.
ఎందుకంటే, రాజధాని కావాలని గతంలో అమరావతి ప్రజలు అడగలేదు. బాబు అమరావతిలో రాజధాని తీసుకొచ్చారు. అమరావతి మధ్యలో ఉన్నది కాబట్టి పోనీలే అని సరిపెట్టుకున్నారు. అమరావతిని భారీగా అభివృద్ధి చేయాలని బాబు నిర్ణయం తీసుకున్నా కుదరలేదు. ఇప్పుడు జగన్ అమరావతిని పక్కన పెట్టి విశాఖకు రాజధానిని మార్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదే ఇప్పుడు గొడవకు కారణం అయ్యింది.
విశాఖ ప్రజలు తమకు రాజధాని కావాలని ఎప్పుడు డిమాండ్ చేయలేదు. అక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి ఆ ప్రాంత వాసులకు రాజధానితో అవసరం లేదు. కానీ, 1953 నుంచి రాజధాని విషయంలో రాయలసీకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. రాయలసీమలో రాజధానిని 1953 లో కర్నూలు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. విడిపోయాక అమరావతి రాజధాని అయ్యింది. రాయలసీమకు అన్యాయం జరిగింది.
ఇప్పుడు జగన్ కూడా విశాఖపై ప్రేమతో మరోసారి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అని రాయలసీమ వాసులు అంటున్నారు. హైకోర్టు ఒక్కటే సరిపోదని, హైకోర్ట్ అన్నది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అని, రాయలసీమ అభివృద్ధి చెందాలి అంటే రాజధాని మొత్తం రాయలసీమలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ ను జగన్ అంగీకరిస్తాడా ? చూద్దాం.
400411 919205Yeah bookmaking this wasnt a bad decision great post! . 692279
57913 201086Outstanding post, I think weblog owners need to larn a whole lot from this weblog its actually user genial . 733390
507831 570245There is noticeably a lot of cash to comprehend this. I assume you made certain nice points in features also. 673522