బాహుబలి లాంటి ప్రపంచ ప్రఖ్యాత సినిమా తీసిన తర్వాత రాజమౌళి తన అభిమానులకు మరియు తెలుగు ప్రేక్షకులకు 2020లో లో RRR చిత్రం తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఒకే తెరపై చూపిస్తున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా నిన్న మాత్రం జక్కన్నకు మరియు ఆర్ఆర్ఆర్ టీమ్ కొత్త సంవత్సరం రోజు ప్రేక్షకుల నుండి ఊహించని కోటింగ్ పడింది. నిన్నటి రోజున ఆర్ఆర్ఆర్ టీమ్ ట్రీట్ అంటూ పాత పోస్టర్ ని కొత్తగా వేయడంపై ఆన్లైన్ లో మీమ్స్ ఒక రేంజ్ లో పడ్డాయి.
స్వయంగా అభిమానులు ఎవరికి నచ్చిన పోస్టర్లు మరియు మీమ్ ను వాళ్ళే పోస్ట్ చేసి ఆర్ఆర్ఆర్ టీమ్ యూనిట్ కు రివర్స్ కోటింగ్ ఇచ్చారు. ఇకపోతే మిగిలిన అన్ని కొత్త సినిమాలు కొత్త పోస్టర్లతో అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపగా మీరు మాత్రం పాత పోస్టర్ పై కొత్త రంగు వేసి హ్యాపీ న్యూ ఇయర్ చెబుతారా? అంటూ ఒక రేంజ్ లో రచ్చ చేశారు జనాలు. ఈ మాత్రం తెలివితేటలు మాకు లేవంటూ ప్రొఫెషనల్ టీమ్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన అభిమానులు ఆ చెత్త పోస్టులు చేయకుండా ఉంటేనే బాగుండేది అంటూ నెటిజన్ల సెటైర్లు గుప్పిస్తున్నారు.
ఆ విషయాలు పక్కనబెడితే ఆర్.ఆర్.ఆర్ టీమ్ చేసిన ఈ పనికి నిజమైన అభిమానులు మాత్రం తీవ్రంగా హర్టయ్యారని సమాచారం. ఏ హీరో సినిమా అయినా విజయం సాధించాలంటే అభిమానులు కీలకం. అభిమానులు లేనిదే సినిమాల్లేవ్. హీరోలు లేనట్టేనన్నది వాస్తవం. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఎప్పటికప్పుడు అగ్ర హీరోలంతా ప్రచార వేదికలపై గుర్తు చేస్తూనే ఉంటారు. మరి ఇవేవీ రామ్ చరణ్- ఎన్టీఆర్- రాజమౌళి బృందానికి గుర్తు లేవా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అభిమానులంటే మరీ అంత చులకనగా కనబడుతున్నారా? అని మండిపడుతున్నారు.
మరి నిన్న వచ్చిన కామెంట్లపై యూనిట్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటివరకూ అయితే ఎలాంటి రెస్సాన్స్ లేదు. కానీ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం యూనిట్ పై ఉందని పలువురి అభిప్రాయం. ఇక అయిన దానికి కాని దానికి ట్వీట్లు చేసే డీవీవీ మీడియా ఈ ఘాటైన కామెంట్లకు ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.