తనపై దుష్ప్రచారానికి దిగుతున్నారనీ, జుగుప్సాకరమైన రాతలు రాస్తున్నారనీ ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్సభ స్పీకర్కి లేఖ రాశారు. ప్రివిలేజ్ మోషన్కి అనుమతినివ్వాలని ఆ లేఖలో స్పీకర్ని కోరారు రఘురామకృష్ణంరాజు. గత కొద్ది రోజులుగా వివిధ అంశాలపై రఘురామకృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న మాట వాస్తవం.
ఇసుక విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. ఆయన ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతున్నారు. దాంతో, వైసీపీ వ్యతిరేక మీడియా, రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలకి ఎక్కువగా ఫోకస్ ఇస్తోంది. దాంతో, వైసీపీ అనుకూల మీడియా తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే రఘురామకృష్ణంరాజుకి వ్యతిరేకంగా కథనాలు వండి వడ్డించేస్తోంది సదరు మీడియా సంస్థ.
తన ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా కథనాలు వస్తుండడంపై రఘురామకృష్ణంరాజు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. లోక్సభలో ప్రివిలేజ్ మోషన్ అంటే సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. ఆ స్థాయిలో రఘురామకృష్ణంరాజు, ఆ వెబ్సైట్ కథనాల నేపథ్యంలో హర్ట్ అయ్యారన్న విషయం అర్థమవుతోందిక్కడ.
నిజానికి, గతంలోనూ ఓ ఎంపీ విషయంలో ఇలాగే సదరు వెబ్సైట్ వ్యవహరించడంతో, వ్యవహారం అరెస్టులదాకా వెళ్ళింది. మరి, ఈసారి ఏమవుతుందోగానీ.. మీడియా సర్కిల్స్లో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఓ యువ హీరో విషయంలోనూ సదరు వెబ్సైట్ వివాదాల్లోకెక్కింది. ఆ వెబ్సైట్పై చర్యల దిశగా సినీ పరిశ్రమ కూడా సమాలోచనలు చేసింది.
58687 835281Extremely interesting subject , thanks for posting . 543830