దేశంలో నిర్భయ కేసు తరువాత అలాంటి సంచలనం సృష్టించిన కేసు ప్రియాంక రెడ్డి కేసు. ఈనెల 27 వ తేదీన ప్రియాంక రెడ్డిని రాత్రి 9:30 గంటల సమయంలో ఓఆర్ఆర్ వద్ద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్యచేశారు. అక్కడితో ఆగకుండా, ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితుల నుంచి పోలీసులు చాలా వరకు సమాచారం సేకరించారు.
అయితే, ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఉదంతంపై హైదరాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డారు. ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నలుగురు నిందితులను బహిరంగా ఉరి తీయాలని ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. కొంతమంది ప్రజలు వాళ్ళను తమకు అప్పగించాలని, నిందితులకు తాము శిక్ష వేస్తామని అంటున్నారు.
కొంతమందైతే.. 2008 లో రాజశేఖర్ రెడ్డి హయాంలో వరంగల్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసినట్టుగా నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి పోలీసులు, అధికారులు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారా లేదంటే కోర్టుకే వదిలేసి కాలయాపన చేసి వాళ్ళను వదిలేస్తారా.. ? చూద్దాం.
నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ మంత్రులు సైతం ఇదే విధమైన మాట చెప్తున్నారు. కానీ, సంఘటన జరిగిన వెంటనే దానికి పరిష్కారం ఉండాలని, నిందితులు తప్పు చేశారని ప్రపంచానికి తెలిసినపుడు వెంటనే వాళ్ళను బహిరంగంగా ఎందుకు ఉరి వేయరు… ఎందుకు చంపెయ్యారు.. దీని గురించే ఇప్పుడు అందరు చర్చిస్తున్నారు.
85227 858579Read More HERE. I bookmarked it. 901950
489156 914669This internet site is my breathing in, real amazing style and perfect content . 246773