కరోనా వైరస్ విషయంలో ఆంధ్రపదేశ్లో చిత్రమైన రాజకీయ క్రీడ నడుస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేస్తే, ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కులాన్ని ఆపాదించింది అధికార పార్టీ. కరోనా కేసులు తగ్గాక ఎన్నికల పక్రియ మొదలు పెడితే, ‘వద్దే వద్దు’ అంటూ కుంటి సాకుల్ని తెరపైకి తెచ్చింది వైసీపీ. ప్రభుత్వం తరఫున సరైన సహకారం అందకపోయినా, న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఎలాగైతేనేం పంచాయితీ, మునిసిపల్ ఎన్నకల్ని నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.
కానీ, పరిషత్ ఎన్నికలు మాత్రం ఆగిపోయాయి. ‘త్వరగా అవి కూడా పెట్టేయాలి..’ అంటూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో మళ్ళీ వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం, తన పదవీ కాలం ముగుస్తున్నందున ఇప్పటికిప్పుడు తన హయాంలో పరిషత్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చేశారు. మళ్ళీ ఆయన మీద వైసీపీ బురద చల్లే కార్యక్రమం షురూ చేసింది.
ఇంకో వారం రోజులాగితే ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దిగిపోతారు. ఆయన స్థానంలో కొత్త కమిషనర్ వస్తారు. ఆ కమిషనర్ ఎలాగూ అధికార పార్టీకి అనుకూలమైన వ్యక్తే అవుతారు గనుక.. ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు తొందరపడుతోంది.? అన్నది ఆసక్తికరమైన అంశం.
ఇక, రాష్ట్రంలో పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయనీ, ఈ పరిస్థితిని తాము ముందే ఊహించి హెచ్చరించినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వినలేదన్నది వైసీపీ వాదన. ఎవరి వాదనలు వారివే. మొత్తంగా రాష్ట్రాన్ని అడ్డగోలు రాజకీయాలకు వేదికగా మార్చేసి.. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించేశారన్నమాట. వద్దన్నవాళ్ళే కావాలంటారు.. కావాలన్న వాళ్ళే వద్దంటారు.. స్థానిక ఎన్నికల్లో ఎటూ గెలిచేది అధికార పార్టీనే. అయినాగానీ, ఓ సారి ఎన్నికలు వద్దే వద్దని.. ఇంకోసారి కావాలని.. ఇదెక్కడి రాజకీయం.?
200759 339145I enjoy your writing type, do maintain on writing! Ill be back! 656887
309845 859231Yay google is my king aided me to discover this excellent website ! . 551857
803015 446739Awesome blog! Is your theme custom made or did you download it from somewhere? A design like yours with a few simple tweeks would really make my blog jump out. Please let me know where you got your design. Thank you 737771