పోలీసులంటే లాఠీలు ఝలిపించడమే కాదు.. మానవత్వాన్ని కూడా ప్రదర్శిస్తారని విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులు నిరూపించారు. కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న ఓ మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు మోసి శెభాష్ అనిపించుకున్నారు. సీతపాలెం తీరానికి శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అయితే, శనివారం వరకు కూడా మృతదేహం కోసం ఎవరూ రాలేదు. అప్పటికే అది కుళ్లిపోయి దుర్వాసన కూడా వస్తోంది. ఈ పరిస్థితుల్లో దానిని తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో ఎస్ఐ అరుణ్ కుమార్ స్పందించారు. ఏఎస్ఐ దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డు కొండబాబుతో కలిసి కర్రల సాయంతో మృతదేహాన్ని సీతపాలేనికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి వాహనంలో యలమంచిలిలోని మార్చురీకి తరలించారు. దీంతో రాంబిల్లి పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఈ ఘటనపై స్పందించి రాంబిల్లి పోలీసులను అభినందించారు.
339619 365879I was just searching for this information for a while. After six hours of continuous Googleing, finally I got it in your web site. 853696
872699 22965Im having just a little concern I cant subscribe your feed, Im using google reader fyi. 17273
419310 95649Thank you for sharing with us, I conceive this internet site genuinely stands out : D. 799346
7174 521997This really is a nice weblog i need to say, generally i don????t post comments on other people???? blogs but would like to say that this post truly forced me to do so! 460954