ఏపీ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడిగా పేరున్న మోకా భాస్కరరావు వారం రోజుల క్రితం హత్యకు గురి అయిన విషయం తెల్సిందే. ఆయన్ను మచిలీపట్నంలోని చేపల మార్కెట్ వద్ద ఒక యువకుడు కత్తితో పొడిచి పారిపోయాడు. భాస్కరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశాడు. పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ హత్య కేసులో కొల్లు రవీంద్రకు ప్రమేయం ఉంది అంటూ అరెస్ట్ అయిన వారు చెప్పారట. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. కొల్లు రవీంద్ర సూచన మేరకు భాస్కరరావును చంపేసినట్లుగా వారు చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు అయిన కారణంగానే కొల్లు రవీంద్ర ఈ హత్యకు సహకారం అందించి ఉంటాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. త్వరలో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
659028 203610An fascinating discussion may be valued at comment. I do believe that you just write read more about this topic, it may possibly not often be a taboo subject but normally persons are too couple of to dicuss on such topics. To a higher. Cheers 768068