‘మమ్మల్ని బూతులు తిడితే మా అభిమానులు, కార్యకర్తలకు బీపీలు వస్తాయ్.. దాడులు చేస్తారు..’ అని కొన్నాళ్ళ క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పారు. అది, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగి విధ్వంసం సృష్టించాక, టీడీపీ కార్యాలయ సిబ్బందిపై హత్యాయత్నం చేశాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి వచ్చిన స్పందన.
‘మీ కార్యకర్తలు, అభిమానులకు మాత్రమే బీపీ వస్తుందా.? మా కార్యకర్తలు, అభిమానులకు బీపీలు రాకూడదా.?’ అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమ పార్టీ పవర్ చూపించారు. నిజానికి, జనసేన కార్యకర్తలెవరూ వైసీపీ మంత్రుల మీద దాడి చేయలేదనే వైసీపీ చెబుతోంది. కాకపోతే, ముఖ్యమంత్రి గతంలో మాట్లాడిన మాటల్ని జనసేన అధినేత ప్రస్తావించారు, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ వీడియో ప్లే చేస్తూ, ‘ప్యాకేజీ అని ఇంకోసారి ఎవరైనా అంటే చెప్పుతో కొడతా..’ అని జనసేనాని సెలవిచ్చారు.
అయినా, పవన్ కళ్యాణ్ తన చెప్పుని చేత్తో పట్టుకుని చూపించి, వైసీపీ నేతల్ని హెచ్చరించడమేంటి.? అంటూ, చాలామంది మేధావులు గుస్సా అయ్యారు. వారికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, గతంలో ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు వైఎస్ జగన్, ప్రజల్ని ఉద్దేశించి ‘చెప్పులు, చీపుళ్ళను ముఖ్యమంత్రికి చూపించండి’ అన్న మాటల తాలూకు వీడియో విడుదల చేసింది జనసేన.
ఆల్రెడీ చెప్పుని జనసేన అధినేత చూపించేశారు. సో, ఇకపై చూపించాల్సింది చీపుళ్ళన్నమాట. ముఖ్యమంత్రికే జనసైనికులు.. అందునా జనసేన వీర మహిళలు చీపుళ్ళను చూపిస్తే ఇంకేమన్నా వుందా.? అప్పట్లో వైఎస్ జగన్ చెప్పారు గనుక, ఆయన మాటల్ని వైసీపీ శ్రేణులు పాటించకపోయినా.. జనసేన పార్టీ తు.చ. తప్పకుండా పాటిస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తాలూకు వేడి, చాలా నెలల ముందే షురూ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేలితోనే, ఆయన కంట్లోనే పొడిచేలా.. అన్నట్లు చెప్పులు, చీపుళ్ళ వ్యవహారాన్ని జనసేన తెరపైకి తీసుకురావడం పట్ల సామాన్య ప్రజానీకంలో కూడా ‘సబబే కదా’ అన్న భావన వ్యక్తమవుతోంది.
396791 898077hi there, your web site is discount. Me thank you for do the job 617644