Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan mohan Reddy)పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( pawan kalyan)మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేదలకి, పెత్తందారులకి మధ్య క్లాస్ వార్ జరుగుతుందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ గా ఒక వీడియోను షేర్ చేశారు.
జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్( Ajay Kumar) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘కథాకళి’ అనే చర్చావేదికలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు( Nagababu) పాల్గొని క్లాస్ వార్ గురించి మాట్లాడుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ‘పాపం పసివాడు( జగన్ ని ఉద్దేశిస్తూ) క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలంటూ పవన్ చురకలు అంటించారు.
ఈ వీడియో ప్రకారం.. చర్చా వేదికలో పాల్గొన్న నాగబాబు క్లాస్ వార్ అంటే ఏంటని అజయ్ కుమార్ ని అడిగారు. కార్ల్ మార్క్స్ రాసిన ‘మేనిఫెస్టో ఆఫ్ ది కమ్యూనిటీ’ లో క్లాస్ వార్ గురించి వివరించారని ఇప్పుడు జగన్ రెడ్డి చెప్పిన క్లాస్ వార్ గురించి ఆయన వింటే షాక్ అయ్యేవారని అజయ్ బదులిచ్చారు. జగన్ పొరపాటున ‘క్యాష్ వార్’ అనబోయి క్లాస్ వార్ అని ఉంటారని నాగబాబు సెటైర్ వేశారు.
గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్ కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ వేదికగా ట్వీట్ వార్ జరుగుతోంది. ఒకరి విమర్శలకు మరొకరు కౌంటర్ ఇచ్చుకుంటున్నారు.