కర్ణాటకలోని బీజిఎంల్ గనుల్లో బంగారం కంటే విలువై పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నాయంటూ ‘సాక్షి’ ఓ కథనంలో తెలిపింది. ఆ కథనం సారాంశం.. ఈ గనుల్లో పల్లాడియం వెలికితీత అంశాన్ని కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం కోలార్ జిల్లా ప్రజలకు తీపి వార్త అవుతుందని లోక్ సభ ఎంపీ ఎస్.మునిస్వామి బెంగళూరులో విలేకరుల సమావేశంలో అన్నట్టు తెలిపింది. గనుల్లో తవ్వకాలపై కార్మికులతో కలిసి ప్రధాని మోదీకి ఇప్పటికే విజ్ఞప్తి చేసామని కూడా అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రధాని సంబంధిత శాఖా మంత్ర ప్రహ్లాద్ జోషి నేపథ్యంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ బీజిఎంల్ గనులను గతంలో సందర్శించి అక్కడి నిక్షేపాలను నమూనాల రూపంలో సేకరించి పరీక్షలకు పంపింది. ఇక్కడ బంగారం కంటే పల్లాడియం అనే లోహం ఉన్నట్టు కమిటీ గుర్తించింది. పీపీపీ తరహాలో ఈ గనులను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ అంశంపై వచ్చే పార్లమెంట్ అంశాల్లో ఓ నిర్ణయం తీసుకోనుందని అన్నారు. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కేంద్రం అనుమతి ఇస్తే ఈ లోహాన్ని ఎక్కువగా సప్లయ్ చేసే అవకాశం ఉంటుంది.
పల్లాడియం అంటే ప్లాటినం లోహాం వలె ఇది కూడా వెండి రంగులో ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతలో కరుగుతుంది. చాలా అరుదైన లోహంగా గుర్తింపు పొందింది. కార్ల ఇంజిన్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాల తయారీలో ఎక్కువగా పల్లాడియంను ఉపయోగిస్తారు. రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా ఉత్పత్తి అవుతోంది. అయితే.. డిమాండుకు తగ్గ సప్లయ్ లేదు. దీని గ్రాము ధర బంగారం, ప్లాటినంల కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.
331435 988558Hi! Someone in my Facebook group shared this site with us so I came to check it out. Im definitely loving the information. Im book-marking and is going to be tweeting this to my followers! Outstanding blog and wonderful design and style. 156581