రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ఒరేయ్ బుజ్జిగా ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్నా కానీ విడుదల చేసుకోవడానికి లేకుండా కరోనా నేపథ్యం వల్ల వాయిదా పడింది. అయితే చివరికి ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ చిత్రం విడుదలవుతోంది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు.
ఎందుకంటే అటు రాజ్ తరుణ్ వరస ప్లాపుల్లో ఉన్నాడు, మరోవైపు దర్శకుడు విజయ్ కుమార్ కొండా నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. అయితే ఈరోజు చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు రేకెత్తించడంలో విజయవంతమైంది.
రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించారు. హెబ్బా చాలా అందంగా ఉంది. మరోవైపు మాళవిక నాయర్ తన బావను అసహ్యించుకునే పాత్రలో కనిపించనుంది. సప్తగిరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.
అలాగే కమెడియన్ సత్య, ప్రవీణ్ లకు కూడా బాగానే స్కోప్ ఉంది. ముఖ్యంగా ఒరేయ్ బుజ్జిగా కన్ఫ్యూజన్ కామెడీ ప్రధానంగా సాగనున్నట్లు అర్ధమవుతోంది. శ్రీను, బుజ్జి పాత్రల మధ్య కన్ఫ్యూజన్ ఈ సినిమాకు మెయిన్ పాయింట్ గా తెలుస్తోంది. చూడాలి మరి సినిమా విడుదలయ్యాక ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.
504996 743033I just put the link of your weblog on my Facebook Wall. quite good weblog indeed.,-, 574292