సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ప్రేమ, పరువు హత్య నేపథ్యంలో వచ్చిన సినిమా ‘ప్రేమిస్తే..’ ఈ సినిమా అప్పట్లో సంచలనం రేపింది. ఇది కూడా నిజజీవిత కథే కావడం విశేషం. ఆ సినిమా తరహాలోనే ఈమధ్య వరుసగా పరువు హత్యలు జరగడం కలకలం రేపుతోంది. 2018లో మిర్యాలగూడలో ప్రణయ్, రీసెంట్ గా హైదరాబాద్ లో హేమంత్.. ఇలా పరువు హత్యలకు గురైన వారే. ఈ ఘటనలను మరువక ముందే బెంగళూరులో అచ్చం ప్రేమిస్తే తరహాలోనే మరో పరువు హత్య జరగడం కలకలం రేపుతోంది.
కర్ణాటకలో లక్ష్మీపతి, ఓ యువతి ప్రేమించుకున్నారు. 2017లో ఒక ఫ్యాక్టరీలో వీరిద్దరికీ పరిచం ఏర్పడింది. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. గత నెలలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దీనిని యువతి తండ్రి తట్టుకోలేకపోయాడు. దీంతో.. మీ పెళ్లికి అంగీకరిస్తున్నాను.. మీరిద్దరూ ఇంటికొస్తే అందరి సమక్షంలో పెళ్లి చేస్తానని నమ్మించాడు. వారిద్దరినీ లక్ష్మీపతిని మగడి తాలూకాలోని ఓ ప్రార్ధనా మందిరానికి వద్దకు రప్పించారు. వీరితో లక్ష్మీపతి అన్న నటరాజ్ కూడా వెళ్లాడు. అక్కడి నుంచి వేరే ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగించారు.
ఆ తర్వాత కులం పేరుతో లక్ష్మీపతిని దూషించి తన కూతురిని వదిలేయాలని బెదిరించాడు. లక్ష్మీపతి ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు. కోపంతో తన కుమారుడితో కలిసి బెల్టుతో గొంతు నులిపి హత్య చేశారు. దీంతో బెదిరిపోయిన నటరాజ్ సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన సంగతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు యువతి తండ్రిని, సోదరుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టారు.
899462 659572undoubtedly like your web web site but you need to check the spelling on several of your posts. Several of them are rife with spelling issues and I uncover it very troublesome to tell the truth nevertheless I will surely come back once again. 971058