సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి మే 9న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మే 1న హైద్రాబాద్లో జరిపేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ ఫాన్స్ కూడా ఈ వేడుకలో ఏ స్టార్ పాల్గొంటాడో అన్న క్యూరియాసిటీ వారిలో ఎక్కువైంది.
తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు మహేష్ ఇద్దరు మిత్రులు పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు మిత్రులతో మహేష్ టైం దొరికినప్పుడల్లా టైం స్పెండ్ చేయడం. వాళ్లతో సరదాగా గడిపేయడం అంటే మహేష్ కి చాలా ఇష్టమట. పైగా వారిద్దరూ కూడా మహేష్ కంపెనీ అంటే తెగ ఇష్టపడతారట. ఇంతకీ ఎవరో ఆ ఇద్దరు అన్న విషయం మీకీపాటికే అర్థం అయిందనుకుంటా !! ఎస్ మీరు ఊహించిన ఆ ఇద్దరు స్టార్స్ ఈ వేడుకకు చీఫ్ గెస్ట్. వాళ్లే ఎన్టీఆర్, రామ్ చరణ్ !! వీరిద్దరూ వస్తారని తెలియడంతో అటు మహేష్ ఫాన్స్ తో పాటు మెగా ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఖుషి అవుతున్నారట. ఈ ముగ్గురు హీరోలు ఒకే వేదికపై కనిపించడం నిజంగా కన్నులకు పండగే కదా. ఇదివరకే మహేష్ తాను నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలిచాడు.
ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలను మహేష్ పర్సనల్ గా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది. మహేష్ కెరీర్ లో అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహర్షి ఇప్పటీకే నాన్ బాహుబలి బిజినెస్ కింద టాప్ లో నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందే అన్ని హక్కులు కలుపుకుని దాదాపు 140 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక మహేష్ సరసన పూజ హెడ్జ్ హీరోయిన్ గా నటిస్తుండగా, అల్లరి నరేష్ మరో కీ రోల్ పోషిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తున్న ఈ సినిమాకోసం ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
