కరోనాతో వందల కొద్ది సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది ఆ ప్రభావం వల్ల మృతి చెందుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను కోల్పోయిన తమిళ సినీ లోకం మరో ప్రముఖ చిత్ర కారుడిని కోల్పోయింది. చిత్రకారుడు ఇళయరాజా ఆదివారం అర్థరాత్రి సమయంలో గుండె పోటుతో మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కరోనాతో బాధపడుతున్న ఈయన గుండె పోటుతో మృతి చెందినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
43 ఏళ్ల ఇళయరాజా కుంభకోణంలోని సెంబియవరంబిల్ అనే గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండే మంచి ఆర్టిస్టుగా గుర్తింపు దక్కించుకున్న ఆయన గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇళయరాజా చేతుల నుండి జాలువారిన పెయింటింగ్స్ లో జీవ కళ ఉట్టి పడుతుంది. పల్లె అందాలను అందమైన అమ్మాయిలను తన ఆర్ట్ తో సృష్టించిన గొప్ప వ్యక్తి ఇళయరాజా. ఆయన మృతి పై తమిళ సినీ ప్రముఖులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.
603773 53070I like this post, enjoyed this 1 appreciate it for putting up. 373352
668730 807320I conceive this web site contains some rattling superb data for everybody : D. 795577