కరోనా వైరస్ విస్తృతి గురించి తెలిసిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది. కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరం ముఖ్య కారణాలు అవుతున్నాయి. అయితే.. ఎటువంటి లక్షణాలు లేకుండా కొంతమందికి వైరస్ సోకడం ఇప్పుడు వైద్య వర్గాలను విస్మయపరుస్తున్నాయి. ఇటివల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీరో సర్వైలెన్స్ సర్వే జరిపిన పరిశీలనలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కరోనా బారిన పడుతున్న వారిలో కొంతమంది ఎటువంటి కరోనా కారక లక్షణాలు లేకుండానే వైరస్ బారిన పడుతున్నారని సర్వే తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో జరిపిన ఈరకంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని సర్వే రిపోర్టులు తెలియజేస్తున్నాయి.
రాష్ట్రంలోని అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ సర్వేను వైద్యఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ జిల్లాల్లో అత్యధికంగా ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అనంతపురం.. 99.5, తూర్పుగోదావరి.. 92.8, కృష్ణా.. 99.4, నెల్లూరు.. 96.1 శాతం మంది ఈ రకంగా వైరస్ బారిన పడ్డారని తేలింది. కృష్ణా జిల్లాలో కూడా 22.3 శాతం మందికి కరోనా సోకి.. తగ్గిపోయింది అని అంటున్నారు. వీరిలో కోవిడ్–19 యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లేనని నిర్ధారణకు వస్తున్నారు.
ఇలా కరోనా సోకిన వారిని ప్రత్యేకంగా హోం క్వారంటైన్ లేదా ఐసొలేషన్ లో ఉంచుతున్నట్టు వైద్య అధికారులు అంటున్నారు. వీరిని పది రోజుల పాటు ఈ విధంగా ఉంచి మందులు వాడుతున్నారు. వీరు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు అంటున్నారు. పదకొండో రోజు నుంచి వీరు మామూలుగా తిరగొచ్చని.. వీరికి మళ్లీ పరీక్షలు అవసరం లేదని అంటున్నారు. వీరి నుంచి వైరస్ వ్యాప్తి ఉండని కూడా అంటున్నారు.
736451 394425You ought to be extremely astute at research and writing. This shows up in your original and exclusive content material. I agree with your primary points on this topic. This content really should be seen by a lot more readers. 898014
111227 184438You produced some very first rate factors there. I regarded on the web for the problem and located many people will associate with along with your web site. 299380
781355 49214wohh precisely what I was seeking for, thankyou for putting up. 980296