మీడియా అంటే, అమ్ముడుపోవడం. అందుకే, పాత్రికేయం కాస్తా పాత్రికేయ వ్యభిచారంగా మారిపోయిందన్న ఆవేదన సీనియర్ పాత్రికేయుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది.!
అది 2009 ఎన్నికల సమయం. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి మీద, అప్పటి కుల గజ్జి కలాలు ఎలాంటి వెకిలి రాతలు రాశాయో చూశాం. రాజకీయాల్లో సరికొత్త మార్పుకి నాంది పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే, ఆ పార్టీని నేలమట్టం చేసేందుకు రెండు ప్రధాన కులాలకు చెందిన కలాలన్నీ ఒక్కటయ్యాయి.
ప్రధానంగా తాము అందుకున్న సొమ్ములకు అనుగుణంగా పాత్రికేయ వ్యభిచారం చేశాయి పచ్చ కలాలు.! ఫలితం, ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం. ‘ఈ రాజకీయాల్లో కొత్త మార్పు కోసం ప్రయత్నం చేయడం వృధా.. కొత్త రాజకీయ శక్తికి మనుగడ అసాధ్యం..’ అని చిరంజీవి తెలుసుకోవాల్సి వచ్చింది.
‘జెండా పీకేద్దాం’ అనే శీర్షికన అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మీద చల్లిన పచ్చ విషం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంపై ఎంత దుష్ప్రచారం చేయాలో, అంతకు మించి చేసేశాయి అప్పటి మీడియా సంస్థలు. అప్పటికీ, ఇప్పటికీ ఆ దుష్ప్రచారం జరుగుతూనే వుంది.
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తాను స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీని, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. తాజాగా వైఎస్ షర్మిల, ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీని’ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజకీయాల్లో కొత్త పార్టీలు స్థాపించడం.. పొత్తులు పెట్టుకోవడం.. రాజకీయంగా కలసి రాకపోతే విలీనం చేయడం.. ఇదంతా ఓ రాజకీయ ప్రక్రియ.
కానీ, అప్పుడు ప్యాకేజీ అని మొరిగిన కలాలు, ఇప్పుడు గమ్మునుండిపోయాయ్.! చిత్రమేంటంటే, పచ్చ కలాలు, నీలి కలాలు.. రెండు అగ్ర కులాలకు చెందిన కలాలు.. నోటికి ప్లాస్టర్లు కాదు, డైపర్లు కూడా కాదు.. ఏకంగా వాడి పారేసిన టాయిలెట్ పేపర్లను అంటించుకున్నాయి. ఇంకా చెప్పాలంటే, మహిళలు వాడిపారేసిన శానిటరీ పాడ్స్తో కవర్ చేసేసుకున్నయని అనడం తప్పు కాదేమో.!
రాజకీయాల్లో కుల జాడ్యం మామూలే.! కానీ, మీడియాలో కుల జాడ్యమేంటి.? కులం పేరుతో మీడియానే రాజకీయ వ్యభిచారం చేయడమేంటి.?