సినిమా రంగంలో ఎదగాలని ఆశపడి వచ్చే వారిని టార్గెట్ చేస్తూ అడ్డంగా దొరికినకాడికి దోచుకుని ఘరానా మోసాలు చేసే వారిని ఇప్పటికే ఏంతో మందిని చూసాం. ఇక అమ్మాయిల విషయంలో అడ్డంగా మోసం చేసిన వారు ఉన్నారు. ఇటీవలే టివి సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తుమ్మల శ్రీదేవి అనే యువతి ఘరానా మోసం బట్టబయలైన సంగతి మరవకముందే మరో దారుణం వెలుగు చూసింది.
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ వ్యక్తి లక్షల్లో వసూలు చేసి పలువుర్ని అడ్డంగా మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు వ్యక్తిపై తిరుపతిలో కేసు నమోదైంది. ఆ వివరాల్లోకి వెళితే సదుం మండలం బయారెడ్డి పల్లెకు చెందిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిగ్రీ పూర్తీ చేసి బెంగుళూర్ లో ఉద్యగం చేస్తున్నాడు. అతని వాట్సాప్ నంబర్ ద్వారా హైదరాబాద్ కు చెందిన నవ్యంద్ర ఫిలిం ఛాంబర్ చైర్మన్ అంటూ ఎస్ వి ఎన్ రావు అనే వ్యక్తి పరిచయం చేసుకుని ఇద్దరు కలిసి సినిమా అవకాశాల ప్లాన్ వేశారు.
ఈ నేపథ్యంలో తిరుపతిలో ఓ ఆఫీస్ ను ప్రారంభించి సినిమా అవకాశాల కోసం వచ్చే వారినుండి 50 వేల చొప్పున వసూలు చేసి వారికి సభ్యత్వం అందించారు. ఈ సంఘటన 2018 లో జరిగింది. అయితే దాదాపు పదదుల సంఖ్యలో జనాలు డబ్బులు ఇచ్చారట. మెంబర్ షిప్ కార్డు వచ్చింది కాబట్టి ఛాన్సులు వస్తాయని ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగిలింది.
అప్పుడు ..ఇప్పుడు అంటూ అవకాశాలను దాటవేస్తూ సదరు నిర్వాహకులు తప్పించుకు తిరుగుతున్నారట. దాంతో తాము మోసపోయామని గ్రహించిన వాళ్ళు తిరుపతి పోలీసులను ఆశ్రయించారట. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసారు. ఇప్పటికైనా సినిమా అవకాశాల పేరుతొ ఇంకా మోసపోవద్దంటూ పోలీసులు తెలిపారు.
822280 298582Locating the correct Immigration Solicitor […]below you will uncover the link to some internet sites that we feel you ought to visit[…] 838669