రాజకీయ క్రీడలో కీలకమైన ప్రచారపర్వానికి నేటి సాయంత్రంతో తెరపడింది. రోజు తన మాటలతో అన్ని పార్టీల వారు కత్తులు దూసుకున్న సంగతి తెలిసిందే. ఇక మాటల కత్తులు పక్కన పడేసి ఇప్పుడు నోట్లకట్టలు చేతికి పట్టుకున్నారు. ప్రచార పర్వం ముగియడానికి ముందే ఎక్కడికక్కడ నోట్లకట్టలు వరదలా పారుతున్నాయి. ఫలానా పార్టీ అన్న తేడా లేకుండా అందరూ ఓటుకు నోటును చాలా పకడ్భందీగా పాటిస్తున్నారు. కొంతలో కొంత జనసేన డబ్బుల విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నా.. ప్రధానా పార్టీలు మాత్రం ఓటుకు 1500 నుంచి 5000 దాకా పంపకాలు సాగిస్తున్నారనే వార్తలు జిల్లా నుంచి వినిపిస్తున్నాయి. నువ్వు వెయ్యి అంటే ఆ వెంటనే నాది రెండువేలు అన్నట్లుగా పంపకాలు సాగుతున్నాయట. చాలాచోట్ల డబ్బు రూపంలో కష్టం అవుతుందని ఒకే కుటుంబానికి ఎకమొత్తంగా లెక్కగట్టి తమకు తెలిసిన వారి షాపులో వారికి కావలసిన వస్తువులు తీయిస్తున్నారట. మరికొన్ని చోట్ల చీరలు, ముక్కుపుడకలు సంఖ్యను బట్టి వస్తువుల పరిణామం మారుతూ ఉందట. ఇలా సాగుతోంది ఎన్నికల సమరం.
వైసీపీలో తిరిగి ఆత్మవిశ్వాసం
గత ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో చాలాచోట్ల తప్పుల మీద తప్పులు చేసిన జగన్ ఇప్పుడు పకడ్భందీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. పలు సర్వేల్లో కూడా వైసీపీదే అధికారం అంటున్న వేల వారు ఉత్సాహంతో ఉన్నా.. గత ఎన్నికల లాగా దెబ్బ తినకూడదని.. ఇప్పుడు వీళ్లు కూడా డబ్బు పంపకాల విషయంలో ఎక్కడికక్కడ పోటీ పడుతున్నారట. గత టర్మ్లో బాగా దెబ్బకొట్టిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈసారి చాలా వ్యూహాలు రచించి మరీ ఆ పార్టీ నాయకులు ముందుకు పోతున్నారు. ఎన్నికలకు చాలా మునుపే ఖర్చు విషయంలో వెనుకాడకుండా దూసుకుపోయారు. ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి ఖచ్చితంగా పని చేస్తుందనే నమ్మకంతో వారు ఉన్నారు. ఎంత కాదనుకున్నా దాదాపు 120 నుంచి 135 సీట్లు గెలుస్తామని.. అది లేదంటే ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేస్తామనే ధీమా వారిలో కనిపిస్తోంది. జగన్ కూడా చాలాకాలంగా ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకుసాగారు. చూడాలి మరి ఈసారైనా అధికార పీఠం దక్కుతుందా..? లేక అందని ద్రాక్షలా మిగులుతుందా అన్నది.
టీడీపీ చివరి అస్త్రాలు పనిచేస్తాయా?
ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా పోల్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబును మించినవారు లేరని చెప్పకతప్పదు. గత టర్మ్లో ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా తన మేధస్సుకు పనిచెప్పి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబును చాలా తక్కువగా అంచనా వేస్తున్నారని.. సరిగ్గా ఎన్నికల ముందర అన్నివర్గాల వారికి తాయిలాలు ప్రకటించడంతో పాటు… రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేశారు. పసుపు కుంకుమ, వృద్యాప్య పెన్షన్లు చాలావరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నా చంద్రబాబు మీద మాత్రం మేధావి వర్గాల్లో ఇప్పటికీ నమ్మకం ఉంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని వైసీపీకి గెలుపు అంత సునాయాసం కాదని అంటున్నారు. చూడాలి మరి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుని ముఖ్యమంత్రిగా అవుతారో లేక ఇంటికి పరిమితం అవుతారో.
జనసేన ఆశలు సజీవం..
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన వ్యూహాలు తాను రచిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయన కొంతవరకు డబ్బున్న వారిని నమ్ముకున్నా.. ఎక్కువశాతం తన జనసైనికులనే నమ్ముకున్నారు. అభిమానులు కూడా తమ హీరో కొడితే జాక్పాట్ కొడతారనే నమ్మకాన్ని మాత్రం వ్యక్తంచేస్తూ ఉన్నారు. కీలకమైన మేధావి వర్గాలు ఉండేచోట బలమైన, నమ్మకమైన వారిని నిలబెట్టడంతో చాలావరకు సీట్ల విషయంలో ఎమైనా జరగొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన పవన్.. ఆ వర్గంవారు చాలామటుకు పవన్కు అనుకూలంగా నిలబతున్నారు. ఒకప్పటి చిరు వేరు తమ్ముడు వేరనే అభిప్రాయాన్ని కలిగించడంతో ఈయన్ను ఒకసారి చూద్దామనే స్వంత సామాజికవర్గం కూడా చాలాచోట్ల గట్టిగా పావులు కదుపుతూ ఉంది. చూడాలి మరి పవన్ అదృష్టం ఏమేకు ఉందో.
కాంగ్రెస్, వామపక్షాల ఉనికి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో వారిని పెద్దగా ప్రస్తావణలోకి తీసుకోవడం లేదు. అదృష్టం కలిసివస్తే.. ఒకటో ఆర దక్కుతాయనే ఆశలు వారిలో కూడా ఉన్నాయి. మునుపటితో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా కాస్తాంత కోలుకున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశంతో ఎలాగూ బహిరంగం ఒప్పందం ఉంది కాబట్టి వారు గెలిచినా ఓడినా పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. ఎటోచ్చి అన్ని పార్టీలు గెలుపు మాదంటే మాది అనే ధీమాను వ్యక్తపరుస్తున్నాయి. ఏ విషయం అయినా ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే,
69117 71157What a lovely blog. Ill surely be back once more. Please preserve writing! 204951
766851 210931Hi, Thanks for your page. I discovered your page by means of Bing and hope you maintain providing more great articles. 164784